ఇచ్చోడ: దుబాయ్లో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహించనున్న కార్యక్రమంలో గుస్సాడీ ప్రదర్శన ఇవ్వడానికి శుక్రవారం జిల్లా నుంచి కళాకారులు వెళ్లారు. తెలంగాణ భాషా సంస్కృతి, తెలంగా ణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సంయక్తంగా నిర్వహించనున్న కార్యక్రమంలో గుస్సాడీ ప్రదర్శనకు తమకు అవకాశం లభించినట్లు ఆదివాసీ సకల కళా సంఘం డైరెక్టర్ కాత్లె శ్రీధర్ ఈ సందర్భంగా తెలిపా రు. జిల్లా నుంచి దుబాయ్కి వెళ్లినవారిలో కాత్లె శ్రీధర్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, ఒగ్గు రవి, పేరిన రాజ్కుమార్, అంది భాస్కర్, కాత్లే ఆనంద్ ఉన్నారు.