● ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ సేవలు ● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ | - | Sakshi
Sakshi News home page

● ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ సేవలు ● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

Jun 4 2025 12:19 AM | Updated on Jun 4 2025 12:19 AM

● ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ సేవలు ● ఎస్పీ అఖిల్‌

● ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ సేవలు ● ఎస్పీ అఖిల్‌

ఆదిలాబాద్‌టౌన్‌:జిల్లాలో హోంగార్డుల కోసం ఆరో గ్య భద్రత పథకం ప్రారంభించినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీసు కా ర్యాలయంలో పలువురికి మంగళవారం ఆరోగ్య భద్రతకార్డులు అందజేశారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జిల్లాలోని 240 మంది హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ సే వలతో పాటు ఇతర వైద్యసేవలపై రాయితీ లభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌సింగ్‌, సీసీ కొండ రాజు, హోంగార్డు ఆర్‌ఐ ఎన్‌.చంద్రశేఖర్‌, జిల్లా పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సాంకేతికత వినియోగించుకోవాలి

సైబర్‌నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన 15 రోజుల సైబర్‌ శిక్షణలో జిల్లా పోలీసులు పాల్గొ ని ప్రతిభ కనబరిచారు. రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పి. గోపీకృష్ణ, సైబర్‌ ల్యాబ్‌ కానిస్టేబుళ్లు ఎంఏ రియా జ్‌, జి.త్రిశూల్‌లు పలు అంశాల్లో ప్రతిభ కనబరిచి తొలి మూడుస్థానాల్లో నిలిచారని పేర్కొన్నారు. వారి ని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు, సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

హోంగార్డులకు అందజేసిన ఆరోగ్య భద్రత కార్డులతో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఏఎస్పీ కాజల్‌సింగ్‌

కమశిక్షణతోనే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు

క్రమశిక్షణతోనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నాలుగు కేంద్రాల్లో నెల రోజుల పాటు నిర్వహించిన వేసవి శిబిరాలు మంగళవారంతో ముగిశాయి. ఆదిలాబాద్‌ పోలీ సు హెడ్‌క్వార్టర్స్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి, ఇచ్చోడ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ శిబిరాల్లో 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమాన్ని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ హాజరై మాట్లాడారు. చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకోవాలని విద్యార్థులకు సూ చించారు.అనంతరం విద్యార్థుల నృత్య, యోగా, కరాటే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన రిజర్వ్‌ సిబ్బంది, ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, యో గా, కరాటే, గేమ్స్‌ టీచర్లను ఎస్పీ అభినందించా రు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్‌రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్‌, ఎల్‌.జీవన్‌రెడ్డి, సీఐ సీహెచ్‌.కరుణాకర్‌రావు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement