
వరద ముప్పు తప్పేనా!
వివరాలు..
ఆదిలాబాద్లోని వార్డులు 49
కుటుంబాలు 48,393
జనాభా 1,50,383
ప్రధాన డ్రైనేజీలు 20
వెంటనే పనులు ప్రారంభిస్తాం
పట్టణంలోని భారీ డ్రెయిజీల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు పనులు చేపట్టేందు కోసం రూ.20లక్షల వ్యయంతో కూడిన టెండర్లు ఆహ్వానించాం. ఈ ప్రక్రియ సైతం ఇటీవల పూర్తి చేసి ఎంపిక చేసిన కాంట్రాక్టర్కు పనులు అప్పగించాం. ఆదివారం నుంచి వరద ముంపు డ్రెయినేజ్లీలో పూడిక తీత పనులు ప్రారంభిస్తాం.
– సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్
కై లాస్నగర్: వర్షాకాల సీజన్ ప్రారంభమైంది. పట్టణంలోని పలు డ్రెయినేజీలు పొంగి ప్రవహించే అవకాశముంది. అయితే అందులో ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిన చెత్తాచెదారం కుప్పలు, తెప్పలుగా పేరుకుపోయింది. దీంతో చిన్నపాటి వర్షానికే డ్రెయినేజీల్లోని మురుగునీరంతా రోడ్లపైకి చేరి కాలనీల్లోని ఇళ్లలోకి చేరే ప్రమాదం లేకపోలేదు. సీజన్కు ముందే వేసవిలో పూడికతీత పనులు చేపట్టాల్సిన బల్దియా అధికారులు ఇప్పటి వరకు ఆ దిశగా దృష్టి సారించలేదు. వర్షాలు ప్రారంభమైతే పారిశుధ్య పనులు ముందుకు సాగే అవకాశముండదు. బల్దియా అధికారుల నిర్వాకంతో తమకు ముంపు భయం పొంచి ఉందని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెత్తాచెదారంతో డ్రెయినేజీలు..
గ్రేడ్–1 స్థాయికి ఎదిగిన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పట్టణవాసుల అవసరాలకు అనుగుణంగా డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. విద్యానగర్, రాంనగర్, సుభాష్నగర్, రిక్షాకాలనీ, రిమ్స్ ఆసుపత్రి, పంజాబ్చౌక్, శాంతినగర్, మహలక్ష్మివాడ, హౌసింగ్బోర్డు, ఖానాపూర్ వంటి పలు కాలనీల్లో సుమారు 20కి పైగా భారీ డ్రెయినేజీలు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేస్తున్నప్పటికీ మరికొన్నింటిని మాత్రం బల్దియా అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో అవి చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్, ఇతరత్రా వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. ఈ సమయంలో ఓ మోస్తరు స్థాయిలో వర్షం కురిస్తే డ్రెయినేజీల్లోని నీరంతా రోడ్లపై ప్రవహించే అవకాశముంది. అలాగే పలుచోట్ల ఇళ్లు సైతం వరద ముంపునకు గురయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
డ్రెయినేజీల్లో పేరుకుపోయిన పూడిక
తొలగింపుపై దృష్టి సారించని యంత్రాంగం
వర్షాలు షురూ కావడంతో పట్టణవాసుల్లో గుబులు