
నైపుణ్యాలతో బోధన ప్రమాణాలు మెరుగు
బాసర: కమ్యూనికేషన్ నైపుణ్యాలు బోధన ప్రమాణాలు మెరుగుపర్చడంలో కీలకమని ఇన్చార్జి వీసీ గోవర్ధన్ పేర్కొన్నారు. ఆర్జీయూకేటీలో శుక్రవారం ఇంగ్లిష్ విభాగం ఆధ్వర్యంలో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్’అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ ఫ్యాకల్టీలు తమ ప్రొఫెషనల్ అభివృద్ధికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం బోధనలో నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడేలా ఉంటుందన్నారు. కార్యక్రమ సమన్వయకులుగా హెచ్ఓడీ విజయ్ కుమార్ అప్సింగర్, అసోసియేట్ డీన్లు విఠల్, మహేశ్, నాగరాజు, పీఆర్వో విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.