వనమహోత్సవ లక్ష్యాన్ని పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

వనమహోత్సవ లక్ష్యాన్ని పూర్తిచేయాలి

Jun 7 2025 12:16 AM | Updated on Jun 7 2025 12:16 AM

వనమహోత్సవ లక్ష్యాన్ని పూర్తిచేయాలి

వనమహోత్సవ లక్ష్యాన్ని పూర్తిచేయాలి

● పీసీసీఎఫ్‌ డాక్టర్‌ సువర్ణ

ఆదిలాబాద్‌టౌన్‌: వన మహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్‌) డాక్టర్‌ సువర్ణ అన్నారు. బాసర జోన్‌ పరిధిలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల అటవీ శాఖ అధికారులతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వన మహోత్సవానికి సంబంధించి లక్ష్యాలను సాధించాలన్నారు. 46 లక్షల మొక్కలు నాటే లక్ష్యం పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఎవరైనా కొత్తగా పోడు కోసం అటవీ భూ ములు సాగు చేస్తే కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మావల హరితవనం పార్కు, కుంటాల జలపాతాల్లో సఫారీలను ఏర్పాటు చేస్తామన్నారు. వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని చించుఘాట్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఆదిలాబా ద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల డీఎఫ్‌ఓలు ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌, వికాస్‌ మీనన్‌, నాగిబాను, రవిప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement