
నేడు బక్రీద్
● మసీదులు, ఈద్గాలు ముస్తాబు ● ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు
నెన్నెల/ఉట్నూర్రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బక్రీద్కు మసీదులు, ఈద్గాలు ముస్తాబు చేశారు. శనివారం పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలకు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ తదితర పట్టణాల్లో ఏర్పాట్లు చేశారు. ఇస్లాం క్యాలెండర్లోని బక్రీద్ మాసంలో 11వ రోజు పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. త్యాగనీరతికి ప్రతీకగా ముస్లింలు పండుగ జరుపుకుంటారు. పండుగ రోజు జంతువులను బలి ఇచ్చి మాంసాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పేదలకు సమభాగాలుగా పంపిణీ చేస్తారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పండుగను త్యాగానికి ప్రతీకగా నెన్నెల మత గురువు షగీర్ అహ్మద్ పేర్కొన్నారు. చెడును నిరోధించడం, మంచిని పెంచడం, కష్టాల్లో సహనం వహిస్తూ త్యాగనీరతిని చూపించాలన్న సందేశమే ఖుర్బానీలో దాగి ఉందని, ప్రతీ ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలని తెలిపారు. పండుగను శాంతియుత వాతావరణంలో కుటుంబ సమేతంగా జరుపుకోవాలని ఉట్నూర్లోని జామ మసీద్ మౌలానా కలీం పేర్కొన్నారు.