
వివాదాస్పద స్థలం పరిశీలన
కైలాస్నగర్: ఆదిలాబాద్ పట్టణ పరిధిలోని జీఎస్ ఎస్టేట్లో గల వివాదాస్పద రోడ్డు స్థలా న్ని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ జేఆర్ చౌహాన్ శుక్రవారం పరి శీలించారు. కొంతమంది రియల్ వ్యాపారులు రోడ్డు స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించా రంటూ పలువురు ఇటీవల కలెక్టర్ రాజర్షి షా ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చే పట్టాలనే కలెక్టర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ ఆ స్థలాన్ని పరిశీలించారు. కాలనీవాసులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీపీవో సుమలత, డీపీబీవో సాయికృష్ణ తదితరులున్నారు.