
పట్టణంలో భారీ బందోబస్తు
ఆదిలాబాద్టౌన్: బక్రీద్ సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, మసీదుల వద్ద పికెటింగ్లు ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి బందోబస్తును పరిశీలించారు. జిల్లా ప్రజలు మతసామరస్యం కలిగి ఉండి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకున్నారని తెలిపారు. ఈద్గా వద్ద ప్రార్థనలకు హాజరైన పలువురు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు సునీల్కుమార్, కరుణాకర్రావు తదితరులున్నారు.