
అతివకు చేయూత
● సీ్త్రనిధి రుణ లక్ష్యం ఖరారు ● రూ.36కోట్లు అందించేలా కార్యాచరణ ● ఇప్పటికే రూ.2కోట్ల రుణాలు అందజేత
కై లాస్నగర్: జిల్లా సీ్త్రనిధి రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.36 కోట్ల రుణాలు అందించాలని నిర్ణయించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన స్వయం సహాయక సంఘాలకు ఆ మొత్తాన్ని అందించే దిశగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మండలాల వారీగా అందించాల్సిన రుణ లక్ష్యాన్ని ఖరారు చేసేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటికే రూ.2కోట్ల రుణాలు అందజేసి అతివల అభ్యున్నతికి అండగా నిలుస్తున్నారు.
స్వయం సమృద్ధి సాధించేలా..
స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. స్వయం సమృద్ధి సాధించేలా వారికి అండగా నిలుస్తోంది. కుటీర పరిశ్రమలు, కిరాణ, టైలరింగ్ షాపులు, వస్త్ర దుకాణాలు, సెంట్రింగ్ యూనిట్, పాడి ఆవులు, గేదెలు, పెరటి కోళ్ల పెంపకం, లేడిస్ ఎంపోరియం వంటి వ్యాపారాలు ప్రారంభించేలా బ్యాంకు లింకేజీతో పాటు సీ్త్రనిధి రుణాలు అందజేస్తూ వారికి ఆర్థిక చేయూత అందిస్తోంది. గతంలో అందించే రూ.20వేల వ్యక్తిగత రుణాలను ఈ సారి రూ.40వేలకు పెంచారు. ఆదాయం ఆర్జించే వ్యాపారాల కోసం రూ.3లక్షల వరకు అందజేస్తున్నారు. జిల్లాలోని అర్హత సాధించిన స్వయం సహాయక సంఘాలకు రూ.36 కోట్లను అందించాలని నిర్ణయించారు. ఇందులో మున్సిపాలిటీ పరిధిలో గల మెప్మా ఆధ్వర్యంలోని సంఘాలకు రూ.9కోట్లు కేటాయించగా, 20 గ్రామీణ మండలాల్లోని స్వయం సహాయక సంఘాలకు రూ.27 కోట్లు కేటాయించారు. సంఘాల అర్హత ఆధారంగా ఏ మండలానికి ఎంత నిధులు కేటాయించాలనే టార్గెట్లు ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు మండల, పట్టణంలోని వార్డుల వారీగా లక్ష్యం ఖరారు కానప్పటికీ నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఈ మూడు నెలల్లో రూ.2కోట్ల రుణాలను సభ్యులకు అందజేశారు.
గతేడాది లక్ష్యాన్ని అధిగమించి...
2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 30.14 కోట్ల రుణాలను సీ్త్రనిధి ద్వారా అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందులో 222 గ్రామ సంఘాల పరిధిలోని 1045 స్వ యం సహాయక సంఘాలకు గాను రూ. 32.74 కోట్ల రుణాలు అందజేశారు. కేటా యించిన లక్ష్యానికి మంచి 100.79 శాతం సాధించారు. రుణాల మంజూరులో ఆశించిన దానికంటే మెరుగైన ప్రగతి సాధిస్తున్నప్పటికీ వాటి రికవరీలో మాత్రం వెనకబడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం, వీవీఓలు, సీసీలు, ఏపీఎంలు పట్టింపులేని తనంగా వ్యవహరించడంతో ఏటా ఈ రుణ బకాయిలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా రూ. 51కోట్ల 8లక్షల బకాయిలు పేరకుపోయి ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది.
సద్వినియోగం చేసుకోవాలి
మహిళల ఆర్థికాభివృద్ధికి సీ్త్రనిధి ఎంతగానో తోడ్పడుతుంది. వ్యక్తిగత రుణాలతో పాటు వ్యాపారపరంగానూ రూ.40వేల నుంచి రూ.3లక్షల వరకు రుణాలు అందజేస్తున్నాం. స్వయం సహాయక సంఘాల సభ్యులు వా టిని సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించాలి. తీసుకున్న రుణాలు పెండింగ్లో ఉంచకుండా సకాలంలో చెల్లించాలి.
– పూర్ణచందర్, సీ్త్రనిధి ఆర్ఎం