భూభారతితో సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూభారతితో సమస్యలు పరిష్కారం

Jun 4 2025 12:19 AM | Updated on Jun 4 2025 12:19 AM

భూభారతితో సమస్యలు పరిష్కారం

భూభారతితో సమస్యలు పరిష్కారం

● కలెక్టర్‌ రాజర్షిషా

నేరడిగొండ: భూభారతితో భూ సమస్యలు త ర్వితగతిన పరిష్కారమవుతాయని కలెక్టర్‌ రాజ ర్షిషా అన్నారు. మండలంలోని అరెపల్లిలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. ప్రతీ ఒక్కరికి తమ భూమిపై హక్కు చట్టబద్ధంగా, స్పష్టంగా ఉండేలా భూ భారతి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా స్థానికుల నుంచి వచ్చిన దరఖాస్తుల ను పరిశీలించారు. ప్రజలు భూరికార్డులపై పూర్తి సమాచారం కలిగి ఉండటం ద్వారా భవిష్యత్తులో సమస్యలకు తావు లేకుండా ఉంటుందని సూచించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, స్థానిక అధికారులు, సిబ్బంది ఉన్నారు.

అడేగామ(కే)లో..

ఇచ్చోడ: మండలంలోని అడేగామ(కే)లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్‌ రాజర్షి షా హాజరై పలు రికార్డులను పరిశీలించారు. అలాగే గ్రామస్తులతో మాట్లాడారు. భూభారతి చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూ సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించేలా కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సత్యనారాయణరావు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

విద్యార్థుల సంఖ్య పెంచాలి

కైలాస్‌నగర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అమ్మ ఆదర్శ కమిటీలు చొరవ తీసుకోవాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బడిబాట నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ..జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున తరగతి గదులు, టాయిలెట్స్‌, కిచెన్‌షెడ్స్‌ శుభ్రపర్చాలన్నా రు. సమావేశంలో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఈవో శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో రాథో డ్‌ రవీందర్‌, ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement