
వానొస్తే.. తిప్పలే!
పాలకుల నిర్లక్ష్యం గిరిపుత్రులకు శాపంగా మారుతోంది. ఏటా వర్షాకాలంలో మారుమూల గ్రామాలకు వెళ్లే మార్గంలో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. మండలంలోని మామిడిగూడ (ఏ) గ్రామం నుంచి మామిడిగూడ(బి), మా మిడిగూడ(జి) గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న వడగాం వాగు చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లుతుంది. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజ లు వాగుదాటేందుకు ఇబ్బందులకు గురవుతున్నా రు. పలువురు అందులో కొట్టుకుపోయిన ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. వడగాం బ్రిడ్జి నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ సర్కారు 2023లో రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రస్తుత ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తుండడంతో కాంట్రాక్టర్లు ఈ పనులు చేపట్టడం లేదని తెలుస్తోంది. అలాగే గౌరాపూర్ పంచాయతీ పరిధిలో గల వాగు సైతం చిన్నపాటి వర్షానికి పొంగుతుంది. ఈ క్రమంలో చిట్టబట్ట, చిట్ట బట్టగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచి స్థానికుల కు తిప్పలు తప్పట్లేదు. ఇప్పటికై నా పాలకులు స్పందించి వానాకాలం ఇక్కట్లు తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి
బరంపూర్లో..
దేవాపూర్లోని లోలెవల్ వంతెన
ఉప్పొంగే కాలం.. ప్రమాదాలకు మూలం
ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలకు లోలెవల్ వంతెనలు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చడం లేదు. చిన్నపాటి వర్షాని కే వరద ప్రవాహం పెరిగి వంతెనలు మునుగుతున్నాయి. దాటడానికి వీలు లేకుండా మారుతున్నాయి. ఆదిలాబాద్లోని టైలర్స్ కాలనీ, తలమడుగు మండలం బరంపూర్, దేవాపూర్ లోలెవల్ వంతెనలే ఇందుకు నిదర్శనం. వాటికి సైడ్వాల్స్ సైతం లేకపోవడం ప్రమా దకర పరిస్థితికి అద్దం పడుతోంది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

వానొస్తే.. తిప్పలే!

వానొస్తే.. తిప్పలే!

వానొస్తే.. తిప్పలే!

వానొస్తే.. తిప్పలే!

వానొస్తే.. తిప్పలే!