
సేంద్రియం.. రైతుకు సాయం
● వినియోగిస్తే లాభాలెన్నో.. ● జిల్లాలో అందుబాటులో ఎరువు ● అన్నదాతకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ
ఆదిలాబాద్అర్బన్: అన్నదాతలను అప్పుల ఊబి లోకి లాగుతున్న వాటిలో రసాయన ఎరువులు ప్రధానమైనవి. మోతాదుకు మించి వాడడం, భూసారం తగ్గిపోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా చేసిన అప్పులు తీరక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వ్యవసాయ శాఖ సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పి స్తున్నా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో 5.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కొంత మంది రైతులు ఇప్పటికే విత్తనాలు విత్తగా, మరికొంత మంది సాగుకు భూములను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ సారైన రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియంపై దృష్టి సారిస్తారా.. లేదా అనేది చూడాలి.
సేంద్రియ సాగుతో లాభాలెన్నో..
సేంద్రియ ఎరువుల వాడకం వలన పంటలను చీడపీడల బెడద నుంచి తప్పిండంతో పాటు మంచి దిగుబడులు సాధించవచ్చు. పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఆరుతడి, కూరగాయల సాగు కు ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు సూచిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా తయారవడంతో భూసారం సైతం పెరుగుతుంది. పశువుల పేడ, వానపాములు, ఆకులు, తడి, పొడి చెత్త, ఇ తర వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చనివ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అయితే రైతులకు అవసరమైనప్పుడల్లా రసాయన ఎరువులు అందుబాటులో ఉండడంతో సేంద్రియంపై శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది.
ఈ సారైనా రసాయన ఎరువులు తగ్గేనా.?
జిల్లాలో ప్రస్తుతం మార్కెట్ నిండా రసాయన ఎ రువులున్నాయి. వ్యవసాయశాఖ సైతం ఎరువులను మండలాలు, గ్రామాల వారీగా సరఫరా చేసి రైతులకు అందుబాటులో ఉంచింది. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా అన్నదాతలు వాటికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే రసాయన ఎరువుల వాడకంతో భూసారం తగ్గడంతో పాటు పెట్టుబడి వ్యయం పెరిగి రైతులు అప్పుల పాలవుతున్నారు. పర్యావరణంపైనా ప్రభావం చూపుతుంది. వీటిని అధిగమించాలంటే సేంద్రియ ఎరువుల వినియోగం ఒక్కటే మా ర్గమని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఇప్పటికే అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న ఎరువులు
ఎరువు రకం అందుబాటులో ఉన్నది
(మెట్రిక్ టన్నుల్లో)
యూరియా 25,374
డీఏపీ 4,843
ఎంవోపి 1,047
ఎస్ఎస్పీ 1,786
కాంప్లెక్స్ ఎరువులు 23,665
సేంద్రియ ఎరువు 800
అవగాహన కల్పిస్తున్నాం.
సేంద్రియ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రసాయన ఎరువులు అధికంగా వాడితే భూసారం తగ్గి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే సేంద్రియ ఎరువు వాడితే భూసారం పెరగడంతో పాటు మంచి దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. రైతులతో ఏర్పాటు చేసిన ఆయా కమిటీల ద్వారా గ్రామాలో అవగాహన కల్పిస్తున్నాం.
– శ్రీధర్స్వామి, జిల్లా వ్యవసాయాధికారి