కుష్ఠురహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కుష్ఠురహిత సమాజమే లక్ష్యం

Jun 5 2025 7:27 AM | Updated on Jun 5 2025 7:27 AM

కుష్ఠురహిత సమాజమే లక్ష్యం

కుష్ఠురహిత సమాజమే లక్ష్యం

ఆదిలాబాద్‌టౌన్‌: కుష్ఠు రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. కుష్ఠు కే సుల నమోదులో భాగంగా నిక్షిత్‌–2 పాయింట్‌ జీరోపై డేటాఎంట్రి అపరేటర్లకు బుధవా రం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఒకరోజు శిక్షణ నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన మాస్టర్‌ ట్రైనర్లు ప్రొజెక్టర్‌ ద్వారా డెటా ఎంట్రీ నమోదును వివరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, 2027 నాటికి కుష్ఠురహిత దేశం లక్ష్యంగా ప్ర భుత్వాలు ప్రణాళికలు రూపొందించాయన్నా రు. వైద్య సిబ్బంది సైతం క్షేత్రస్థాయిలో ఈ అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇప్పటికే ఎన్‌సీడీసీ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. అదే తరహాలో కుష్ఠు కేసులను గుర్తించి వాటిని నిక్షిత్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. స్పర్శ లేని మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం వామన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement