● ముందస్తు వానలతో గందరగోళం ● పలుచోట్ల విత్తనం వేసిన రైతులు ● నిరాశలో దుక్కి సిద్ధం చేయనివారు ● సాగులో వెనుకబడుతామని దిగాలు ● తొందర పడొద్దంటున్న అధికారులు | - | Sakshi
Sakshi News home page

● ముందస్తు వానలతో గందరగోళం ● పలుచోట్ల విత్తనం వేసిన రైతులు ● నిరాశలో దుక్కి సిద్ధం చేయనివారు ● సాగులో వెనుకబడుతామని దిగాలు ● తొందర పడొద్దంటున్న అధికారులు

May 31 2025 1:43 AM | Updated on May 31 2025 1:43 AM

● ముం

● ముందస్తు వానలతో గందరగోళం ● పలుచోట్ల విత్తనం వేసిన రైత

సాక్షి, ఆదిలాబాద్‌: ముందస్తు వానలు కురుస్తుండడంతో జిల్లా రైతులు అయోమయానికి గురవుతున్నారు. సాధారణంగా వానాకాలం మొదలైన తర్వా త జూన్‌ మొదటి వారం నుంచి రైతులు విత్తనాలు వేస్తారు. అయితే ఈసారి వానాకాలం రాకముందే వర్షాలు కురుస్తుండడం, అవి తొలకరి వానలని, అల్పపీడన ప్రభావంతో కూడా పడుతున్నాయని పలువురు అంటుండగా అన్నదాతలు గందరగోళంలో ఉన్నారు. తాంసి, తలమడుగు, భీంపూర్‌ మండలాల్లో పలువురు రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసి ఉండడంతో ఇప్పటికే పత్తి విత్తనాలు వేశారు. కొన్నిచోట్ల మొలకలు కూడా వచ్చాయి. ఇక విత్తనా లు వేయని రైతులు సందిగ్ధంలో ఉన్నారు. తొలకరి వానలు ఎత్తిపోతున్నాయని, చదును పనులు చేద్దామంటే వానల కారణంగా దుక్కులు సిద్ధం చేయలే ని పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తు త వర్షాలకు విత్తనం వేయకపోతే నష్టపోతామేమో నని అని దిగులు చెందుతున్నారు.

‘గులాబీ’ ముప్పు తప్పదా?

ఇప్పటికే కొందరు పత్తి విత్తనాలు వేయగా పంట చివరి దశలో గులాబీ తెగులు బారిన పడే ప్రమాదముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చె బుతున్నారు. ఈ నేపథ్యంలో పంట సాగుకు ఇప్పు డే తొందర పడొద్దని సూచిస్తున్నారు. జిల్లాలో ముందు నుంచి జూన్‌ రెండో వారంలో విత్తనాలు వేయ డం సాధారణం. ఇప్పుడు అదే పద్ధతిని రైతులు అనుసరించాలని సూచిస్తున్నారు. తొందరపడి విత్తనాలు వేస్తే ప్రధానంగా గులాబీ తెగులుతోపాటు ఇతర చీడపీడల బారిన ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ముందస్తు వానలు జిల్లాలో నిరంతర సాగు పద్ధతుల్లో వెళ్లే రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి.

అనుకూల వర్షాలు కురుస్తాయి

నల్లరేగడి భూముల్లో 60 నుంచి 80 మిల్లీ మీటర్ల వర్షపాతం, చె లక భూముల్లో 75 నుంచి 100 మి.మీ.ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు వేసుకోవాలి. ఈసారి వ్య వసాయానికి అనుకూలమైన వర్షాలున్నాయి. మధ్యస్థ, భారీ వర్షాలు కురువనున్నాయి.

– డాక్టర్‌ శ్రీధర్‌చౌహాన్‌, అసోసియేట్‌ డీన్‌, వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్‌

జూన్‌ మొదటి వారం తర్వాతే..

తొలకరి వర్షాలు కురి సిన నేపథ్యంలో దుక్కులను సాగుకు సిద్ధం చేసుకోవాలి. భూమిలో తేమ శాతం పెరిగాకే విత్తనాలు వే యాలి. నైరుతి రుతుపవనాలకు తోడు అల్ప పీడన ప్రభావం ఉండడంతో ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. జూన్‌ మొదటి వారం తర్వాత విత్తనాలు వేసుకోవాలి.

– మోహన్‌దాస్‌,

వ్యవసాయ శాస్త్రవేత్త, ఆదిలాబాద్‌

జూన్‌ 1నుంచి సెప్టెంబర్‌ 30 వరకు వర్షపాతం వివరాలు.. (మి.మీ.లలో..)మాసం సాధారణ వర్షపాతం 2022లో.. 2023లో.. 2024లో.. జూన్‌ 202.9 173.1 86.6 228.7జూలై 325.5 866.8 715.3 411.9ఆగస్టు 301.5 205.7 123.7 193.8సెప్టెంబర్‌ 166.1 235.7 279.9 236.4

మొత్తం 996.0 1481.3 1205.5 1070.8

● ముందస్తు వానలతో గందరగోళం ● పలుచోట్ల విత్తనం వేసిన రైత1
1/3

● ముందస్తు వానలతో గందరగోళం ● పలుచోట్ల విత్తనం వేసిన రైత

● ముందస్తు వానలతో గందరగోళం ● పలుచోట్ల విత్తనం వేసిన రైత2
2/3

● ముందస్తు వానలతో గందరగోళం ● పలుచోట్ల విత్తనం వేసిన రైత

● ముందస్తు వానలతో గందరగోళం ● పలుచోట్ల విత్తనం వేసిన రైత3
3/3

● ముందస్తు వానలతో గందరగోళం ● పలుచోట్ల విత్తనం వేసిన రైత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement