● భూ భారతితో సమస్యలు పరిష్కారం ● ఈనెల 20 వరకు మూడో విడత రెవెన్యూ సదస్సులు ● త్వరలో గ్రామపాలన అధికారుల నియామకం ● ఉట్నూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ● జిల్లాకు నూతనంగా నాలుగు 108 వాహనాలు ● రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ
సాక్షి,ఆదిలాబాద్: తెలంగాణ రైజింగ్– 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం సమగ్ర సంక్షేమ అభివృద్ధి ల క్ష్యంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ స లహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. తెలంగా ణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవా రం నిర్వహించిన వేడుకలను ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. మొదట తెలంగాణ చౌక్లోని అమరవీరుల స్తూపం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి జాతీయ పతాకం ఆవిష్కరించారు. పోలీ సుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయా రంగాల్లో జిల్లా ప్రగతిని వివరించారు.
● అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రైతులను రుణ విముక్తులను చేసినట్లు తెలిపారు. పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12వేలు ఆర్థికసాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల పరిహారం అందజేస్తున్నట్లు వివరించారు.
● ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి 3,500 చొ ప్పున నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చే స్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని చెంచుల కు 10వేల గృహాలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నా రు. గిరిజన భూములకు సాగునీరు, విద్యుత్ స దుపాయం కోసం ఇందిర సౌర గిరిజలవికా సం కార్యక్రమం ప్రారంభించినట్లు వివరించారు.
● జిల్లాలోని 17 మండలాల్లో ఒక్కో ప్రభుత్వ పాఠశాలను గుర్తించి కృత్రిమ మేధ (ఏఐ) కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా 302 మంది విద్యార్థులు ఏఐ విద్యను అభ్యసిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొదటిసారిగా ఆ రోగ్య పాఠశాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఉట్నూర్ మండలంలోని పులిమడుగులో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు మంజూరు ఉత్తర్వులు జారీ అయినట్లు పేరొన్నారు.
● జిల్లాకు నూతనంగా నాలుగు 108 వాహనాలు మంజూరైనట్లు తెలిపారు. టీజీఎంఎస్ఐడీసీ ద్వారా రూ.34 కోట్లతో నర్సింగ్ కాలేజ్, హాస్టల్ భవన నిర్మాణ పనులు డిసెంబర్లోగా పూర్తి చే యనున్నట్లు పేర్కొన్నారు. ఉట్నూర్లోని 50 ప డకల ఆస్పత్రిని 100 పడకలకు ఉన్నతీకరించేందుకు రూ.13.5 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే బోథ్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రూ.10.5 కోట్లతో 50 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని ఆగస్టులోగా పూర్తి చేసి ప్ర జలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. బ్యాంక్ లింకేజీ కింద ఈ ఆర్థిక సంవత్సరానికి 101 స్వయం సహాయక సంఘాలకు రూ.8.39 కోట్లు, శ్రీనిధి కింద రూ.2 కోట్ల రుణా లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
● భూభారతి నూతన చట్టం అమలు ద్వారా భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఈనెల 20 వరకు ఆయా మండలాల్లో మూడో విడత రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలి పారు. అలాగే రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామపాలన అధికారులను నియమిస్తున్నాం. అలాగే ప్రతీ గ్రామానికి పోలీసు అధికారిని కేటాయించి విలేజ్ పోలీసు ఆఫీసర్ వ్యవస్థను పటిష్టం చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆది లాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అటవీశాఖ అధి కారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జెండా వందనం చేస్తున్న షబ్బీర్ అలీ తదితరులు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు
ఉత్తమ సేవలకు గుర్తింపు