
అర్హులా.. కాదా
● ‘రేషన్’ ఎందుకు తీసుకోవట్లేదు? ● జిల్లాకు చేరిన అనుమానాస్పద కార్డుదారుల జాబితా ● అనర్హుల తొలగింపునకు కసరత్తు ● క్షేత్రస్థాయిలో మొదలైన విచారణ
కై లాస్నగర్: రేషన్కార్డుదారులకు ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అందజేస్తోంది. అయితే వీటిని తీసుకోవడానికి చాలా మంది కార్డుదారులు నెలల తరబడి ముందుకు రావడం లేదు. దీంతో వారికి విడుదల చేసిన కోటా బియ్యం డీలర్ల వద్ద మిగిలిపోతుంది. ఇలాంటి వాటిని అనుమానాస్పద కార్డులుగా గుర్తించిన ప్రభుత్వం వారి వివరాలతో కూడిన జాబితాను జిల్లాకు పంపించింది. దీంతో మండలాల వారీగా వివరాలు సిద్ధం చేసిన జిల్లా పౌరసరఫరాల అధికారులు కార్డుల వివరాలను తహసీల్దార్లకు అందజేశారు. దీంతో అసలు వారు అర్హులా.. కాదా తేల్చే దిశగా రెవెన్యూశాఖ ఫోకస్ పెంచింది. క్షేత్రస్థాయి విచారణ అనంతరం అర్హులు కాకుంటే ఆ కార్డుల తొలగింపునకు సిద్ధమవుతుంది.
జిల్లాలో 3,319 కార్డులు ..
జిల్లాలో 3,319 రేషన్కార్డుదారులు ఆరు నెలలుగా బియ్యం తీసుకోనట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ కార్డులకు సంబంధించి 5,675 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెలా బియ్యం కోటా విడుదల చేస్తున్నా తీసుకోవడం లేదు. దీంతో అసలు కార్డుదారులు బతికే ఉన్నారా.. లేక శాశ్వతంగా వలస వెళ్లారా.. వందేళ్లు పైబడిన, 18 ఏళ్లలోపు పిల్లల పేరిట కార్డులేమైనా ఉన్నాయా అనే దానిపై ఆరా తీయనున్నారు. ఈమేరకు తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణకు సిద్ధమవుతన్నారు. ఒకవేళ అనర్హులని తేలితే వెంటనే వాటిని రద్దు చేయనున్నారు. అలాగే మరణించిన వారి పేర్లుంటే కార్డు నుంచి తొలగించనున్నారు.
సన్నబియ్యం పంపిణీ నుంచి ఇదీ పరిస్థితి..
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఓ వైపు కార్డుదారులు బియ్యం కోసం దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. మరోవైపు రెండు నెలల్లో జిల్లాలో వేలాది గా కార్డుదారులు బియ్యం తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇక కొత్త కార్డు కోసం దరఖా స్తులు వెల్లువెత్తుతుంటే కార్డులున్న వారు బియ్యం పొందేందుకు ముందుకు రాకపోవడమేంటనే సందేహం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఇత ర రాష్ట్రాలకు చెందిన వారు, ఆదాయ పన్ను చెల్లించే వారు కూడా కార్డులు పొందినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి విచారణ అనంతరం ఇందులో అనర్హులు ఎంతమంది ఉన్నారో తేలనుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
సన్నబియ్యం పంపిణీ ప్రారంభమయ్యాక పరిస్థితి ఇలా..
ప్రభుత్వం జిల్లాకు పంపించిన అనుమానాస్పద రేషన్కార్డుల వివరాలు
మండలం రేషన్కార్డులు యూనిట్లు
ఆదిలాబాద్అర్బన్ 945 1804
ఆదిలాబాద్రూరల్ 345 503
బజార్హత్నూర్ 93 153
బేల 187 282
భీంపూర్ 105 187
భోరజ్ 110 149
బోథ్ 113 157
గాదిగూడ 168 364
గుడిహత్నూర్ 104 167
ఇచ్చోడ 112 182
ఇంద్రవెల్లి 114 171
జైనథ్ 119 184
మావల 139 269
నార్నూర్ 120 237
నేరడిగొండ 30 56
సాత్నాల 72 103
సిరికొండ 48 81
సొనాల 64 102
తలమడుగు 95 148
తాంసి 44 66
ఉట్నూర్ 192 310
తహసీల్దార్లకు అందజేశాం
ప్రభుత్వం నుంచి అందిన అనుమానస్పద కార్డుల వివరాలను మండలాల వారీగా సిద్ధం చేసి తహసీల్దార్లకు అందజేశాం. వారు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అనర్హులను తొలగిస్తారు. అలాగే సన్నబియ్యం తీసుకునేందుకు ముందుకు రాని వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాం. అనర్హులు రేషన్కార్డులను పొంది ఉంటే వాటిని స్వచ్ఛందంగా అధికారులకు అప్పగించాలి. విచారణలో తేలితే మాత్రం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –వాజీద్అలీ, డీఎస్వో
నెల మొత్తం కార్డులు బియ్యంతీసుకున్నవారు తీసుకోనివారు
ఏప్రిల్ 1,91,755 1,73,339 18,416
మే 1,91,762 1,72,142 19,620