వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Jun 3 2025 12:29 AM | Updated on Jun 3 2025 12:29 AM

వాతావరణం

వాతావరణం

ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.

‘నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం’కు శ్రీకారం

కైలాస్‌నగర్‌: రైతులు విత్తన ఖర్చు తగ్గించుకో వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు షబ్బీర్‌ అలీ అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాల యం, వ్యవసాయ శాఖ సంయుక్త అధ్వర్యంలో చేపట్టిన ‘నాణ్యమైన విత్తనం– రైతన్న కు నేస్తం’ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అదిలాబాద్‌ అర్బన్‌, మావ ల, అదిలాబాద్‌ రూరల్‌, ఇంద్రవెల్లి మండలా లకు చెందిన పలువురు రైతులకు పెసర, కంది విత్తన సంచులను పంపిణీ చేశారు. అనంత రం మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో గ్రా మ స్థాయిలోనే విత్తన లభ్యత సాధించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించా రు. జిల్లాలోని 103 క్లస్టర్ల పరిధిలో ఎంపిక చే సిన రైతులకు 1,540 విత్తన కిట్‌లను మంగళవారం నుంచి ఆయా రైతు వేదికల్లో ప్రజాప్రతినిధుల చేతులమీదుగా అందజేయనున్నట్లు జిల్లానోడల్‌ అధికారి శ్రీధర్‌చౌహాన్‌ తెలిపారు.

కలెక్టర్‌కు సన్మానం

ఇటీవల ప్రధానమంత్రి అవార్డు అందుకున్న కలెక్టర్‌ రాజర్షిషాను షబ్బీర్‌ అలీ శాలువాతో సత్కరించారు. కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆయన సేవలను ప్రశంసించారు.

పలు కార్యాలయాల్లో ఆవిర్భావ వేడుకలు..

కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో కలెక్టర్‌ రాజ ర్షిషా మువ్వన్నెల పతాకం ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపించారు. పలువురు వి ద్యార్థులకు పెన్నులు, నోటుబుక్‌లు అందజేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి జాతీయ పతాకం ఎగురవేశారు. అలాగే జిల్లా పరిషత్‌లో జెడ్పీ సీఈవో జితేందర్‌ రెడ్డి, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ సీవీఎన్‌ రాజు, డీఆర్డీఏలో డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఈఈ నర్సయ్య జెండా ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement