
స్లాట్ బుకింగ్ షురూ
● జిల్లాలో తొలిరోజున 16 రిజిస్ట్రేషన్లు
కై లాస్నగర్: ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం జిల్లాలో సోమవారం ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. తొలిరోజున ఆదిలాబాద్లో 18 బుకింగ్లు కాగా 13 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేశారు. సమయం మించి పోవడంతో మరో ఐదింటిని మరుసటి రోజుకు వాయిదా వేశారు. కొత్త విధానంలో తొలి రిజిస్ట్రేషన్ చేసుకున్న గన్నేర రాములుకు సబ్ రిజిస్ట్రార్లు విజయ్కాంత్ రావు, శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేశారు. బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు బుకింగ్లు కాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు సబ్రిజిస్ట్రార్ సాయి వివేక్ తెలిపారు.