
చట్టాలను అతిక్రమించొద్దు
ఇచ్చోడ: చట్టానికి లోబడి పనిచేయాలని, అతి క్రమిస్తే కఠినచర్యలు తప్పవని ఉట్నూర్ ఏ ఎస్పీ కాజల్ సింగ్ హెచ్చరించారు. శుక్రవారం ఇచ్చోడ పోలీస్స్టేషన్ ఆవరణలో ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ ఠాణాల పరిధిలో దా బా హోటళ్ల యజమానులు, పశుమాంస దుకా ణాదారులతో సమావేశమై మాట్లాడారు. దాబా హోటళ్ల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎవరినీ మద్యం సేవించనీయొద్దని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కని పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పే ర్కొన్నారు. ఈ నెల 7న బక్రీద్ పండుగను ప్ర శాంత వాతావరణంలో జరుపుకోవాలని సూ చించారు. పశుమాంస దుకాణాదారులు ముందుగా సూచించిన ప్రదేశాల్లోనే పశువులను వ ధించాలని తెలిపారు. ఆవులు, వాటి పిల్లలను వధిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటుమని హెచ్చరించారు. ఇచ్చోడ సీఐ రాజు, ఇచ్చోడ, నేరడిగొండ, సిరికొండ ఎస్సైలు పురుషోత్తం, శ్రీకాంత్, సాయికిరణ్ పాల్గొన్నారు.