కైలాస్నగర్: జిల్లా సహకారశాఖలో బదిలీల సంద డి మొదలు కానుంది. ప్రాఽథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లో పనిచేసే ఉద్యోగుల కు స్థానచలనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో 44ను జారీ చేసింది. సొసైటీ సెక్రటరీలతోపాటు అందులో పనిచేసే ఉ ద్యోగులనూ బదిలీ చేయాలని భావిస్తోంది. వారికి సంబంధించిన వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా సహకారశాఖ అధికారులు బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 71మంది ఉద్యోగులు బదిలీ కానున్నట్లు నిర్ధారించారు.
ఆవిర్భావం అనంతరం తొలిసారి
అన్నదాతకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 60 ఏళ్ల కిందట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందజేస్తూ అండగా నిలుస్తోంది. రాజకీయంగా ఈ సొసైటీలకు అధికార పార్టీ నాయకులు చైర్మన్లుగా ఎన్నిక కాగా, సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉద్యోగులుగా రైతులకు సేవలందిస్తున్నారు. సాధారణంగా ప్ర భుత్వ శాఖల్లో ప్రతీ రెండు, మూడేళ్లకోసారి ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. అయితే స హకారశాఖలో మాత్రం సోసైటీల ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు బదిలీల ఊసే లేదు. దీంతో ఆయా ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్నారు. ఏళ్ల తరబడి పాతుకుపోవడంతో అక్రమాలకు తెరలేపుతున్నారు. తమను ఎవరూ ఏమీ చేయరనే ధీమాతో సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీ లు సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లను పట్టించుకోకుండా ఇ ష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. బినామీ రైతుల పేరిట రుణాలు తీసుకో వడంతో పాటు ఎరువులు, విత్తనాలు విక్రయిస్తూ ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో గూ డ రాంపూర్, నార్నూర్, ఇంద్రవెల్లి తదితర మండలాల్లోని సొసైటీల్లో అక్రమాలు చోటు చేసుకున్నా యి. ఇలాంటి పరిస్థితులను గుర్తించిన ప్రభుత్వం ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగానే సొసైటీ సీఈ వోలు, ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జీవో జారీ చేసింది.
పీఏసీఎస్ సెక్రటరీలు, ఉద్యోగులకూ..
సొసైటీల్లో తొలిసారిగా ట్రాన్స్ఫర్లు
మార్గదర్శకాల కోసం ఎదురుచూపు
సంఘాలు, సిబ్బంది వివరాలు
జిల్లాలోని మండలాలు 21
పీఏసీఎస్లు 28
సెక్రటరీలు 28
అసిస్టెంట్ సెక్రటరీలు 20
కంప్యూటర్ ఆపరేటర్లు 23