
ఇండ్లు రాకుండా చేస్తున్నారు
అయ్యా.. మేము మావల మండలంలోని బట్టిసావర్గాం గ్రామానికి చెందిన నిరుపేదలం. వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నాం. మా గ్రామానికి 12 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేశారు. మాకు ఇండ్లు మంజూరయ్యాయి. అయితే గ్రామానికి చెందిన కొంతమంది దీన్ని రాజకీయం చేస్తున్నారు. గ్రామస్తులను రెచ్చగొట్టి మాకు ఇండ్లు దక్కకుండా కుట్ర చేస్తున్నారు. అర్హులమైన మాకు అన్యాయం జరుగకుండా చూడాలని కోరుతున్నాం.
ముంపు నుంచి రక్షించండి
మేమంతా తాంసి మండల కేంద్ర వాసులం. గ్రామానికి చెందిన లింగంగౌడ్ ప్రాథమిక పాఠశాలకు నాలుగు మీటర్ల పక్కనే కల్లు కంపౌండ్ నిర్వహిస్తున్నాడు. దాని పక్కనే ప్రవహస్తున్న మత్తడివాగు ఆనుకుని గట్టు వెంబడి పెద్ద మొత్తంలో ఈత చెట్లు నాటాడు. అయితే వాగును ఆనుకునే 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. వనంలా పెంపు చేస్తుండంతో వాగు సాఫీగా ప్రవహించకుండా బ్యాక్ వాటర్ ఇళ్లలోకి వచ్చే ప్రమాదముంది. వర్షాకాలంలో ముంపునకు గురయ్యే అవకాశముంది. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

ఇండ్లు రాకుండా చేస్తున్నారు