
పంచ్ అదుర్స్!
● మంచిర్యాలలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు ● 260 మంది క్రీడాకారులు హాజరు.. ● హోరాహోరీగా తలపడుతున్న బాక్సర్లు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లా కేంద్రం రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు వేదికగా నిలిచింది. ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ (బాక్సింగ్ ఫెడరేషన్ అనుబంధం) పర్యవేక్షణలో ఈనెల 24న ప్రారంభమైన ఈ పోటీలు 26 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 260 మంది బాక్సింగ్ క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. వయస్సు, బరువు ఆధారంగా విభజించిన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతూ శక్తివంతమైన పంచ్లతో ఆకట్టుకుంటున్నారు.
టైసన్ బాక్సింగ్ క్లబ్ ఏర్పాట్లు
పోటీలను తిలకించేందుకు పెద్దఎత్తున ప్రేక్షకులు తరలివస్తున్నారు. టైసన్ బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులకు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించి, లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు పాల్గొనడంతో పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురి క్రీడాకారులను ‘సాక్షి’పలకరించగా తమ అనుభవాలు వెల్లడించారు.

పంచ్ అదుర్స్!