
కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి
ఆదిలాబాద్టౌన్: కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గు రువారం జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ డివిజన్ పరిధి లో మూడు పట్టణ పోలీస్స్టేషన్లు, మూడు సర్కి ల్ కార్యాలయాలు, మొత్తం 12 పోలీస్స్టేషన్లలో దాదాపు 300 కేసులు త్వరగా పూర్తి చేసి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఎంసీ రిపోర్టులను పీఎంఈ, ఎంవీఐ, ఫైర్ అధికారి కార్యాలయంలో పెండింగ్ రిపోర్టులు, అగ్రికల్చర్ కార్యాలయంలోని రిపోర్టులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. కోర్టు డ్యూటీ అధి కారులు జవాబుదారీతనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, సీ ఐలు సునీల్కుమార్, కరుణాకర్, ఫణీందర్, వెంకటేశ్వర్రావు, స్వామి, ఎస్సైలు పాల్గొన్నారు.