విద్యుత్‌ స్తంభం విరిగిపడి మూడేళ్ల చిన్నారికి గాయాలు | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభం విరిగిపడి మూడేళ్ల చిన్నారికి గాయాలు

Published Sat, May 25 2024 12:45 AM

విద్యుత్‌ స్తంభం విరిగిపడి మూడేళ్ల చిన్నారికి గాయాలు

సారంగపూర్‌: మండలంలోని కౌట్ల(బీ) గ్రా మంలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన మెండ్ల శ్రీను–లక్ష్మి దంపతుల మూడేళ్ల కుమార్తె చైత్రపై శుక్రవారం విద్యుత్‌ స్తంభం విరి గిపడగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌కాలనీకి చెందిన రాథోడ్‌ గంగాధర్‌ విద్యుత్‌ అధికారుల అనుమతి తీసుకోకుండా తీగలు తగులుతున్నాయనే కారణంతో చెట్టుకొమ్మలు నరికివేశాడు. ఈక్రమంలో చెట్టుకొ మ్మలు విద్యుత్‌ తీగలపై పడ్డాయి. వాటి బరు వుకు స్తంభం విరిగి ఇంటిముందు ఆడుకుంటున్న చైత్ర కాలుపై పడింది. దీంతో చిన్నారికి కాలు, తలకు బలమైన గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తమ అనుమతి లేకుండా చెట్టు నరికి ప్రమాదానికి కారకుడైన గంగాధర్‌పై ట్రాన్స్‌కో ఏఈ సాయికిరణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై చంద్రమోహన్‌ గంగాధర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement