భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Dec 2 2023 1:46 AM | Updated on Dec 2 2023 10:53 AM

జ్యోతికతో సాయితరుణ్‌ సెల్ఫీ(ఫైల్‌) - Sakshi

జ్యోతికతో సాయితరుణ్‌ సెల్ఫీ(ఫైల్‌)

ఆదిలాబాద్: వారిద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరైనప్పటికీ పెద్దలను ఎదిరించి పెండ్లి చేసుకున్నారు. ఊహించని విధంగా ప్రేయసి మరణించింది. ఆ మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృత్యువాత పడిన సంఘటన షెట్‌పల్లిలో విషాదం నింపింది. మండలంలోని షెట్‌పల్లి గ్రామానికి చెందిన ఆసంపల్లి సాయితరుణ్‌(22) ఇదే షెట్‌పల్లి గ్రామానికి చెందిన జ్యోతిక ఇద్దరూ ప్రేమించుకోగా కులాలు వేరుకావడంతో పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు.

జ్యోతిక గర్భం దాల్చడంతో రక్తహీనతతో నెల కిందట ఆస్పత్రిలో మృతిచెందింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయితరుణ్‌ వారం రోజుల కిందట పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రి తరలించి వైద్యం అందించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లుగా తెలిపారు. మృతుడు నస్పూర్‌ మున్సిపాల్టీ పరిధిలోని సీసీసీలో నివాసం ఉంటుండగా మృతదేహాన్ని స్వగ్రామమైన షెట్‌పల్లికి తరలించారు. నెల రోజుల్లోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరులా రోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement