breaking news
woman delivers son
-
108 వాహనంలో ప్రసవం
కృష్ణా జిల్లా: చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామానికి చెందిన మాతంగి ప్రశాంతి 108 వాహనంలో ప్రసవించింది. ప్రశాంతి పరిస్థితి విషమంగా ఉండటంతో నందిగామ ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు, విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ప్రశాంతిని 108 వాహనంలో తరలిస్తుండగా గుంటుపల్లి సమీపంలో 108 వాహనంలోనే ప్రసవించింది. పురిటినొప్పులతో తీవ్రంగా బాధపడుతున్న ప్రశాంతికి 108 సిబ్బంది సహాయం చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డను తర్వాత విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నందిగామ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకంపై ప్రశాంతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
60 ఏళ్ల వయసులో మగబిడ్డ!
దేవరకొండ (నల్లగొండ): ఆరు పదులు దాటిన వయసులో గర్భం దాల్చి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందో మహిళ. పుత్రుడు పుడితే పున్నామ నరకం తప్పుతుందన్న నమ్మకమో, కొడుకైతే తనను చూసుకుంటాడన్న ఆరాటమో గానీ.. ఇన్నేళ్ల తర్వాత ఆమె మగ సంతానాన్ని పొందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. పెద్ద అడిశర్లపల్ల్లి మండలం వద్దిపట్ల గ్రామం బల్డితండాకు చెందిన లక్ష్మా, రుక్మి(60) దంపతులకు 8 మంది ఆడపిల్లలు పుట్టారు. వీరిలో ఐదుగురు చనిపోగా మిగిలిన ముగ్గురిలో ఇద్దరికి పెళ్లిళ్లయ్యాయి. వాళ్లకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, మగ పిల్లల్లేరన్న బాధ ఆ దంపతులను వేధిస్తోంది. దీంతో రుక్మి మరోసారి గర్భం దాల్చింది. గురువారం రాత్రి దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాధారణ కాన్పు జరిగి, పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. రుక్మి కూతుళ్లలో ఒకరైన బుజ్జికి ఇప్పటికే ఒక మగ, ఆడ పిల్లలున్నారు. ఇప్పుడు తనకు కొత్తగా వచ్చిన బుజ్జి తమ్ముడిని ఎత్తుకుని ముద్దాడుతూ మురిసిపోయింది.