-
‘మహిళా శక్తి’కి జై!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 115 జిల్లాల్లో ‘ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గ్రామీణ మహిళలకు చేరువై వారిలో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయి. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లు కార్మిక సంఘాల్లో సభ్యులైన తమ ఉద్యోగులతో వేతన సవరణపై తదుపరి చర్చలు జరిపేందుకు కూడా అంగీకరించింది. చాలా కాలంగా పెండింగులో ఉన్న సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల వేతనాల పెంపు ప్రతిపాదనకు సైతం మోక్షం లభించింది. ‘బేటీ బచావో–బేటీ పడావో’ విస్తరణ 115 జిల్లాల్లో బ్లాకు స్థాయిలో 920 మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. అలాగే ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతున్న బేటీ బచావో–బేటీ పడావో పథకాన్ని 640 జిల్లాలకు విస్తరించారు. లైంగిక హింస బాధితులకు సాంత్వన చేకూర్చేలా మరో 150 ‘వన్స్టాప్ కేంద్రాల’ ఏర్పాటుకూ కేంద్రం ఓకే చెప్పింది. విస్తృత పథకమైన ‘ది నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్’లో మరో ఏడు కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకాలన్నింటికి 2017–20 మధ్య కాలంలో రూ.3,636.85 కోట్లు వెచ్చిస్తారు. భారం సీపీఎస్ఈల పైనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగులతో 8వ దఫా వేతన చర్చలు జరిపేందుకు రూపొందించిన విధాన ప్రక్రియకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘ఉత్పత్తితో పోలిస్తే కార్మికులకయ్యే వ్యయం పెరగకూడదన్న షరతుకు లోబడి వేతన సవరణ జరగాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం, అది కూడా సీపీఎస్ఈలు తమ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లయితేనే, సంబంధిత పాలనా విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ను సంప్రదించిన తరువాతే వేతన పెంపు నిర్ణయం తీసుకోవాలి’ అని కేబినెట్ భేటీ తరువాత ప్రకటన వెలువడింది. ‘వేతనాలు పెరిగితే కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు. ఆర్థిక భారమంతా సదరు సంస్థపైనే ఉంటుంది. ఉద్యోగుల వేతనాలు పెరిగిన తరువాత తమ ఉత్పత్తులు, సేవల ధరలు పెరగకుండా సీపీఎస్ఈలు చూసుకోవాలి. ఇలా సవరించిన వేతనాలు ఎగ్జిక్యూటివ్లు, అధికారులు, యూనియనేతర ఉద్యోగుల వేతనాలను మించకూడదు’ అని అన్నారు. తమకున్న ఆర్థిక వనరులు, చెల్లించే స్తోమత ఆధారంగా వేతన సవరణపై కార్మికులతో చర్చలు జరిపేందుకు ఆయా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. సవరించిన వేతనాలు 2017, జనవరి నుంచి అమల్లోకి వచ్చి ఐదేళ్లు లేదా పదేళ్లు (ఏది ఎంచుకుంటే అది) వర్తిస్తాయి. అటవీయేతర ప్రాంతాల్లో పెంచిన వెదురు చెట్లను నరికేయకుండా సంబంధిత చట్టంలో సవరణ చేసేలా ఆర్డినెన్స్ తేవడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సీజేఐ వేతనం రూ.2.80 లక్షలు సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో పనిచేస్తున్న జడ్జీల వేతనాల పెంపునకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. జడ్జీల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ 2016లో అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదన ప్రకారం...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2.80 లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ. 2.50 లక్షలు, హైకోర్టు న్యాయమూర్తికి రూ.2.25 లక్షల చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. -
కూడు పెట్టని ‘ఉపాధి’
- రూ.లక్షల్లో కూలి డబ్బుల పెండింగ్ - బ్యాంక్ నుంచే జాప్యం అంటున్న అధికారులు - ఇబ్బందులు పడుతున్న కూలీలు - వెంటనే చెల్లించాలని వేడుకోలు చేవెళ్లరూరల్ : పొట్ట కూటి కోసం పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తే పూట కూడా గడవడం లేదని ఉపాధి హామీ కూలీలు ఉసూరుమంటున్నారు. పని చేసినా కూలీ డబ్బులు చేతికందక పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. పైసల కోసం ప్రతి రోజూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్క చేవెళ్ల మండలంలోనే ఉపాధి పనులకు సంబంధించి దాదాపు రూ.60లక్షలు పెండింగ్లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మండల పరిధిలోని 30 పంచాయతీల్లో దాదాపు సగానికి పైగా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. మొత్తం 3వేలకు పైగా కూలీలు పని చేస్తున్నారు. ఏరోజుకారోజు పనిచేసిన వివరాలను మస్టర్లలో నమోదుచేసి పంపిస్తున్నారు. పనిచేసిన రోజులకు సంబంధించి పే స్లిప్లు కూడా వస్తున్నాయి. డబ్బు మాత్రం చేతికి అందటంలేదు. దీంతో ఇప్పటికే చాలామంది పనులు నిలిపి వేశారు. గత నెల 24వ తేదీ నుంచి డబ్బుల చెల్లింపు పూర్తిగా నిలిచిపోయింది. 15రోజులకోసారి కూలీ డబ్బులు వస్తాయనే నమ్మకంతో అరువు తెచ్చి కుటుంబాలను పోషించుకుంటున్నామని, పైసలు రాక పస్తులుండాల్సి వస్తోందని వాపోతున్నారు. డబ్బులు చెల్లించే సంస్థలు మారడమే కారణం! ఉపాధిహామీ పథకంలో కూలీలకు డబ్బులు చెల్లించేందుకు యాక్సిస్ బ్యాంక్ తరపు ఓ సంస్థ ఉంటుంది. వారే క్షేత్రస్థాయిలో పనిచేసిన కూలీల పేస్లిప్ల ఆధారంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పినో అనే సంస్థ ఈ వ్యవహారాలు చూసేది. ఆరునెలల కిత్రం మనిపాల్ అనే మరో సంస్థకు ఈ తంతు అప్పగించారు. అప్పటి నుంచి చెల్లింపుల విషయంలో ఇబ్బందులు మొదలయ్యాయి. కూలీల వివరాలు అందలేదని కొంతమంది డబ్బులు చెల్లించలేదు. దీంతో వారు పనిచేయడం మానేశారు. కొత్తగా పనిచేస్తున్న వారికి సైతం డబ్బులు చెల్లించటంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. ఈ విషయమై ఉపాధి హామీ పీఓ ఉషను వివరణ కోరగా కూలీలు చేసిన పనులకు సంబంధించి రికార్డులను పంపించామని, బ్యాంక్ నుంచి డబ్బులు మాత్రం రావడం లేదని సమాధానమిచ్చారు. త్వరగా చెల్లించాలి.. రోజూ పనిచేస్తేనే కాని కుటుంబం గడవదు. అందుకే ఉపాధి పనులు చేస్తున్నాం. నాలుగు వారాలుగా కూలీ డబ్బులు అందడం లేదు. చాలా ఇబ్బందింగా ఉంది. అధికారులను అడిగితే అదిగో.. ఇదిగో అంటున్నారు. కూలీ డబ్బులు త్వరగా వచ్చేలా చూడాలి. - జి. సువర్ణ, గొల్లపల్లి ఇబ్బందిగా ఉంది.. ఉపాధిహామీ పథకంలో డబ్బులు సకాలంలో అందుతాయనే నమ్మకంతో పనులు చేశాం. కొన్ని రోజులుగా కూలీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పని మానేస్తే వచ్చే పైసలు కూడా రావేమోనన్న భయంతో రోజూ పనికి వస్తున్నాం. - కె. కాశయ్య, గొల్లపల్లి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement