-
ఫైనల్కు ముందు ఫ్రాన్స్కు భారీ షాక్.. ముగ్గురు కీలక ఆటగాళ్లకి ఆనారోగ్యం
డిసెంబర్ 18న జరగనున్న ఫిఫా ప్రపంచకప్-2022 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్తో అర్జెంటీనా తలపడనుంది. అయితే కీలకమైన ఫైనల్కు ముందు ఫాన్స్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు ఆనారోగ్యం పాలయ్యారు. ఫ్రాన్స్ ఆటగాళ్లు రఫేల్ వారానే, ఇబ్రహీం కొనాటే, కింగ్స్లీ కొమన్ వైరల్ ఫ్లూ బారిన పడినట్లు సమాచారం. దీంతో ఈ ముగ్గురు శుక్రవారం తమ ప్రాక్టీస్ సెషన్కు దూరంగా ఉన్నట్లు ఫ్రెంచ్ ఫుట్బాల్ ఫెడరేషన్ తెలిపింది. కాగా మొరాకోతో సెమీఫైనల్లో ఫ్రాన్స్ సబ్స్టిట్యూట్గా కోమన్ ఎంపికయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో కోమన్ అవసరం ఫ్రాన్స్కు రాలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో మొరాకోను ఫ్రాన్స్ 2-0 తేడాతో చిత్తు చేసి ఫైనల్కు చేరుకుంది. ముఖ్యంగా వారానే, ఇబ్రహీం కొనాటేల ఆనారోగ్యం ఫ్రాన్స్ జట్టును కలవరపెడుతోంది. ఎందుకంటే వీరిద్దరూ మిడ్ ఫీల్డ్లో కీలకమైన ఆటగాళ్లు. మొరాకోతో జరిగిన సెమీఫైనల్కు దయోట్ ఉపమెకానో స్థానంలో జట్టులోకి వచ్చిన కోనాటే అదరగొట్టాడు. ఫ్రాన్స్ డిఫెన్స్లో అతడు అద్భుతంగా రాణించాడు. ఇక ఇదే విషయంపై ఫ్రాన్స్ ఫార్వార్డర్లు రాండల్ కోలో, డెంబెలే స్పందించారు. "వారానే, కొనాటే, కొమన్ జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వారు ఐసోలేషన్లో ఉన్నారు. అయితే లక్షణాలు తేలికపాటిగానే ఉన్నాయి. ఈ ముగ్గురు ఫైనల్ మ్యాచ్కు ముందు కోలుకుంటారని అశిస్తున్నాను" అని రాండల్ కోలో పేర్కొన్నాడు. చదవండి: FIFA WC 2022: ఫిఫా వరల్డ్కప్ ఫైనల్.. ట్రెండింగ్లో ఎస్బీఐ పాస్బుక్ -
వణికిస్తున్న వైరల్ ఫీవర్స్
కోరలు చాస్తున్న డయేరియా వాంతులు, విరోచనాలతో పిల్లలు విలవిల సిరిసిల్లలో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు సిరిసిల్ల : సిరిసిల్ల ప్రాంతంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అతిసారం కోరలు చాస్తోంది. జ్వరం, వాంతులు, విరోచనాలతో జనం విలవిలలాడుతున్నారు. వర్షాలతో తాగునీరు కలుషితం కావడం, దోమలు, పందుల స్వైరవిహారం, పారిశుధ్యలోపం కారణంగా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. జ్వరం, డయేరియాకు గురైనవారు వారం రోజులైనా కోలుకోవడం లేదు. ముఖ్యంగా జలుబు, తలనొప్పి, చలిజ్వరంతో మంచంపడుతున్నారు. ఒళ్లంతా వేడిగా ఉండి బలహీనపడుతున్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వంద మందికిపైగా జ్వరపీడితులు, డయేరియా బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో, ఆర్ఎంపీలు, పీఎంపీల వద్ద మరో ఐదారు వందల మంది వైద్యం చేయించుకుంటున్నారు. ఇందులో మూడు వందల మంది పిల్లలే ఉన్నారు. వణికిపోతున్న పిల్లలు.. జ్వరాలతో పిల్లలు వణికిపోతున్నారు. వాంతులు, విరోచనాలతో వాలిపోతున్నారు. సిరిసిల్ల విద్యానగర్కు చెందిన ఎదురు శివలక్ష్మి(8) సోమవారం నుంచి జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకురాగా.. డాక్టర్లు అడ్మిట్ చేసుకున్నారు. బీవైనగర్కు చెందిన గాజుల రాజేశ్వర్(7) జ్వరం, విరోచనాలతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు సోమవారమే ఆస్పత్రిలో అడ్మిట్ చేసినా.. బాలుడు కోలేకోలేదు. తల్లి వీణ బీడీ కార్మికురాలు, తండ్రి వేణు పవర్లూం కార్మికుడు. ఇదే కాలనీకి చెందిన పొన్నం అఖిల్(6) సైతం జ్వరం, దగ్గుతో బాధపడుతుండగా తల్లి ఆస్పత్రిలో చేర్పించింది. తల్లి లత బీడీ కార్మికురాలు. ఇలా సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రిలో 60 మంది చిన్నారులు అడ్మిట్ అయ్యారు. ఒక్క మంగళవారమే 129 మంది పిల్లలు జ్వరాలు, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ సిరిసిల్ల ఆస్పత్రికి వచ్చారు. ‘సాక్షి’ కథనంతో పెరిగిన మంచాలు.. సిరిసిల్లలో జ్వరాలు, వాంతులు, విరోచనాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై ‘సాక్షి’లో వరస కథనాలు ప్రచురితమయ్యాయి. సిరిసిల్ల ఆర్డీవో జీవీ.శ్యామ్ప్రసాద్లాల్ ఆస్పత్రి సూపరింటెండ్ గూడూరి రవీందర్తో మాట్లాడి అదనపు మంచాలను ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. రోజూ 120 పైగా కేసులు.. – డాక్టర్ మురళీధర్రావు, పిల్లల వైద్యనిపుణులు సిరిసిల్లలో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. పిల్లలకు వాంతులు, విరోచనాలు అవుతున్నాయి. రోజూ 120 పైగా కేసులు వస్తున్నాయి. ఈ రోజు 129 మంది పిల్లలు వచ్చారు. తీవ్రతను బట్టి పిల్లలను అడ్మిట్ చేసుకుని వైద్యం అందిస్తున్నాం. ఈ వ్యాధులు ఎక్కువగా కలుషితమైన నీళ్లు తాగడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్లనే వస్తున్నాయి. అందుకని కాచివడబోసిన మంచినీరు తాగాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పిల్లలకు ఎలక్ట్రాల్ పౌడర్ తాగించాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement