breaking news
Vijay Hazare Trophy one-day
-
హైదరాబాద్ జట్టు కెప్టెన్గా రాహుల్
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన హైదరాబాద్ జట్టుకు రాహుల్ సింగ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. రాహుల్ బుద్ధిని వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈనెల 24 నుంచి జనవరి 18వ తేదీ వరకు విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ దేశంలోని నాలుగు నగరాల్లో (బెంగళూరు, జైపూర్, రాజ్కోట్, అహ్మదాబాద్) జరుగుతుంది. హైదరాబాద్ జట్టు తమ మ్యాచ్లను రాజ్కోట్లో ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో జమ్మూ కశీ్మర్, విదర్భ, బెంగాల్, బరోడా, అస్సాం, ఉత్తరప్రదేశ్, చండీగఢ్ జట్లతో హైదరాబాద్ తలపడుతుంది. ఈనెల 24న జరిగే తొలి మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ను హైదరాబాద్ ‘ఢీ’ కొంటుంది. హైదరాబాద్ వన్డే జట్టు: జి.రాహుల్ సింగ్ (కెప్టెన్), రాహుల్ బుద్ధి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, పేరాల అమన్ రావు, ఎం.అభిరథ్ రెడ్డి, కె.నితేశ్ రెడ్డి, ఎ.వరుణ్ గౌడ్, ఎం.సాయి ప్రజ్ఞయ్ రెడ్డి (వికెట్ కీపర్), ఎ.ప్రతీక్ రెడ్డి (వికెట్ కీపర్), ఎన్.నితిన్ సాయి యాదవ్, సి.రక్షణ్ రెడ్డి, కార్తికేయ కక్, ఇల్యాన్ సథాని, మొహమ్మద్ అర్ఫాజ్. స్టాండ్ బై: పి.నితీశ్ రెడ్డి, కె.హిమతేజ, అనికేత్ రెడ్డి, రాహుల్ రాదేశ్, పున్నయ్య. వినోద్ కుమార్ (మేనేజర్), డీబీ రవితేజ (హెడ్ కోచ్), అభిజిత్ చటర్జీ (అసిస్టెంట్ కోచ్), రొనాల్డ్ రాయ్ రోడ్రిగ్స్ (ఫీల్డింగ్ కోచ్), రంజిత్ కుమార్ (ట్రెయినర్), సంతోష్ కందుకూరి (ఫిజియో), కృష్ణా రెడ్డి (ఎనలిస్ట్). -
మిశ్రా హ్యాట్రిక్
హరియాణా ఘన విజయం విజయ్ హజారే ట్రోఫీ ఆలూరు (కర్ణాటక): విజయ్ హజారే వన్డే ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో హరియాణా 10 వికెట్ల తేడాతో జమ్మూ కశ్మీర్ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కశ్మీర్ 22 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. పేసర్ హర్షల్ పటేల్ (5/21) చెలరేగగా, భారత లెగ్స్పిన్నర్ అమిత్ మిశ్రా (3/4) కెరీర్లో తొలిసారి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అనంతరం బ్యాటింగ్లోనూ హర్షల్ (29 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడు ప్రదర్శించడంతో 11 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 76 పరుగులు చేసిన హరియాణా మరో 234 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకోవడం విశేషం. బెంగళూరులో జరిగిన ఇదే గ్రూప్లోని మరో మ్యాచ్లో జార్ఖండ్ 5 వికెట్లతో కేరళను ఓడించింది. కేరళ 8 వికెట్లకు 236 పరుగులు చేయగా, జార్ఖండ్ 5 వికెట్లకు 240 పరుగులు చేసింది. ధోని (18) మళ్లీ విఫలమయ్యాడు. రాజ్కోట్: గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ నాలుగు వికెట్లతో బెంగాల్ను ఓడించింది. ముందుగా బెంగాల్ 221 పరుగులకు ఆలౌటైంది. వన్డే ప్రపంచ కప్ తర్వాత తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టిన బెంగాల్ పేసర్ మొహమ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం యూపీ 6 వికెట్లకు 222 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మరోవైపు హైదరాబాద్ జట్టు వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. సర్వీసెస్ జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.


