పిచ్చికుక్క స్వైరవిహారం
విడపనకల్లు: పాల్తూరు గ్రామంలోని వడ్డేగేరి, బోయ కాలనీల్లో ఆదివారం వన్నూరుస్వామి, షెక్షావలి, దేవన్న, రామాంజనేయులు సహా ఎనిమిదిమందిపై పిచ్చికుక్క దాడి చేసింది. దారివెంబడి వెళుతున్న వారిపై ఒక్కసారిగా పిచ్చికుక్క దాడి చేసి ముఖం, కాళ్లు, చేతుల భాగాల్లో కరిచి గాయపరిచింది. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కుక్కకాటు బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు.