-
మునుగుతున్న పడవకు ఓటేస్తారా?
సాక్షి, హైదరాబాద్: మునిగిపోతున్న పడవ లాంటి కాంగ్రెస్కు హుజూర్నగర్ ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయరని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి హుజూర్నగర్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారం, ఎన్నికల వ్యూహం అమలు, పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయం తదితర అంశాలపై కేటీఆర్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఎన్నికల ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు ఇతర ఇన్చార్జులు క్షేత్ర స్థాయి పరిస్థితిని మంగళవారం కేటీఆర్కు వివరించారు. మండలాలు, మున్సిపాలిటీలు, వివిధ సామాజికవర్గాలు, పార్టీల వారీగా క్షేత్రస్థాయిలోని పరిస్థితిపై వారు సేకరించిన వివరాలను నివేదించారు. ఈ సందర్భంగా ఇన్చార్జులకు పలు అంశాలపై కేటీఆర్ దిశా నిర్దేశం చేయడంతో పాటు, ప్రచార సరళిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని, ఈ నెల 4తో పాటు, దసరా తర్వాత ఒకట్రెండు రోజులు హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటానని కేటీఆర్ వెల్లడించారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు వెయ్యి శాతం సంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీ ప్రచారానికి మంచి స్పందన వస్తోందని, క్షేత్ర స్థాయి రిపోర్టుల ప్రకారం టీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. దేశం, బీజేపీకి స్పందన ఉండదు.. అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విపక్షాలు.. ప్రస్తుతం ఎవరికి వారుగా విడివిడిగా పోటీ చేస్తున్న తీరు.. ఆయా పక్షాల అనైక్యతకు అద్దం పడుతోందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ గెలుపొందడం ద్వారా హుజూర్నగర్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వంలో లేని వారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదనే అంశాన్ని కూడా ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. హుజూర్నగర్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం ఖాయమని, బరిలో ఉన్న టీడీపీ, బీజేపీకి కూడా ప్రజల నుంచి పెద్దగా ఆదరణ ఉండకపోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని, ఉప ఎన్నికలో విజయం సాధించడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేని ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ఉత్తమ్కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్పై ఎలాంటి వివక్ష చూపకుండా, రాష్ట్రంలోని అన్ని ఇతర నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. టీఆర్ఎస్ హయాంలో ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్.. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదని కేటీఆర్ తెలిపారు. -
నెట్టెంపాడు నీటిని వినియోగించుకోండి
గొర్లఖాన్దొడ్డి (గట్టు ) : నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా అందిస్తున్న సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆరగిద్ద, గొర్లఖాన్దొడ్డి గ్రామాల శివారుల్లోని నెట్టెంపాడు ప్రధాన కాలువ వెంట ఆయన పర్యటించారు. ఆరగిద్ద, గొర్లఖాన్దొడ్డి, చాగదోన, బల్గెర, ఇందువాసి గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతులతో గొర్లఖాన్దొడ్డి గ్రామ సమీపంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టుకు ఎగువ నీటి నీటి ప్రవాహం కొనసాగుతున్నందున నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్కు, అక్కడి నుంచి కాలువలకు సాగునీటిని వదులుతున్నారన్నారు. రైతులు కాలువల ద్వారా వచ్చే నీటిని ప్రధాన కాలువకు గండి పెట్టకుండా క్రమపద్ధతిలో నీటిని వాడుకోవాలని సూచించారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ విజయ్కుమార్, కోఆప్షన్ మెంబర్ నన్నేసాబ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు రామకష్ణారెడ్డి, మహానందిరెడ్డి, హన్మంతు, బస్వరాజుగౌడు, సర్పంచ్లు శంకరన్న, సామేలు, ఎంపీటీసీలు చిన్న మహ్మద్, పుల్లారెడ్డి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
సమయం మించిపోతోంది.. రండి.. ఓటేయండి (ఫొటోలు)
మే 19కల్లా అండమాన్కు రుతుపవనాలు
నాన్నను బతికుండగానే కాలం చేయమని కోరా!: నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న యాంకర్ శ్యామల కుటుంబ సభ్యులు
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement