breaking news
Throw away
-
కసాయి తల్లి...తన ఆరుగుపిల్లల్ని బావిలో పడేసి...
"తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష" అనే చిన్నప్పటి పద్యం మనకు జీవితాంతం అడుగడుగున ఉపకరిస్తుంది. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు, అవమానాలు, సంఘర్షణల సమయయంలో మనం ఎలా వ్యవహరించాలో తెలుపుతుంది ఈ పద్యం. కోపం అనే చిన్న అవలక్షణం కారణంగా పతనమైపోయిన మహానుభావులు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. క్షణికావేశంతో కోపంలో చేసే పనులు కారణంగా తనను తానే కోల్పోవడం లేదా జీవితాంత ఆవేదనతో బతకడమో జరుగుతుంది. ఎంతో మంది యువత కూడా ఈ ఆగ్రహమనే గ్రహానికి బలైపోతున్నారు. అచ్చం అలనే ఇక్కడో మహిళ క్షణికమైన కోపావేశాలకు గురై తన సంతానాన్ని తానే కడతేర్చింది. వివరాల్లోకెళ్తే....మహారాష్ట్రాలోని రాయ్గఢ్ జిల్లాలో ఓ తల్లి తన సంతానాన్ని తానే చంపుకుంది. కుటుంబ కలహాల కారణంగా తన ఆరుగురు పిల్లల్ని బావిలో పడేసి చంపేసింది. చనిపోయిన ఆ ఆరుగురు చిన్నారుల్లో ఐదుమంది బాలికలే ఉన్నారు. ఈ ఘటన ముంబైకి 100కిలోమీటర్ల దూరంలోని మహద్ తాలూకాలోని ఖరవలి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు 30 ఏళ్ల మహిళ తన భర్త కుటుంబ సభ్యులు తనను దారుణంగా కొట్టడంతో ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలిపారు. చనిపోయిన చిన్నారులంతా 18 నెలల నుంచి 10 ఏళ్ల మధ్య వయసు వారేనని అధికారులు తెలిపారు. (చదవండి: గాయత్రి ఇల్లు కబ్జాకు కుటుంబీకుల యత్నం) -
పారేసింది... పట్టుకున్నారు...
నవమాసాలు మోసి.. కన్న బిడ్డను ఓ తల్లి రోడ్డుపై పడేసేందుకు యత్నించింది. ఈ ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎన్.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... కాప్రా జమ్మిగడ్డలో నివసించే జయ (21) బిహార్కు చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల క్రితం వీరు విడిపోయారు. కాగా, అప్పటి నుంచి జయ తాగుడుకు బానిసై బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. జయ నెలన్నర క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మంగళవారం రాత్రి జయ చిత్తుగా మద్యం తాగి ఆటోలో వెళుతూ నేరేడ్మెట్ మూడు గుళ్ల వద్ద ఒడిలో ఉన్న పసికందును రోడ్డుపై పడేసేందుకు యత్నించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. జయను, పసి కందును పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు జయను విచారించి మల్కాజిగిరి మారుతినగర్లో నివసించే జయ సోదరి మీనాకు అప్పగించారు.