breaking news
telugu talli statue
-
తీరికలేదు తల్లీ..!
మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. అని కీర్తిస్తున్నాం.. కానీ ఆ తల్లి మెడలో వాడిన పూలదండ..గ్రాంధిక చెరలో మగ్గిపోయిన తెలుగును సామాన్యులకు చేరువ చేశారంటూ గిడుగు రామ్మూర్తికి నీరాజనాల గొడుగు పడుతున్నాం..ఆయన జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా కొన్నేళ్ల నుంచీ జరుపుకొంటున్నాం.. కానీ దురదృష్టం.. తెలుగును బతికించాల్సిన పాలకులకే తెలుగుతల్లి గానీ.. గిడుగువారు గానీ గుర్తురాలేదు..తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఏర్పడిందని ఘనంగా చెప్పుకొంటున్న తెలుగుదేశం ఏలుబడిలో ఉన్న సమయంలోనే ఈ దురవస్థ పట్టడం నిజంగా విచారకరం. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలు ఉత్సాహంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించగా.. మంత్రులు, అధికార పార్టీ ప్రముఖులు అసలు వాటి చాయలకే పోకపోవడం సిగ్గుచేటు..సాధారణంగా సాంస్కతిక శాఖ ప్రభుత్వపరంగా అధికారికంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటుంది. కానీ ఈసారి ఎందుకో అధికారులు సైతం శీతకన్ను వేశారు. ఫలితంగా మద్దిలపాలెం జంక్షన్లో ప్రభుత్వమే ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహం ఒక్క పూలదండ కాదు కదా.. కనీసం శుభ్రతకైనా నోచుకోకుండా ఇదిగో ఇలా.. దీనంగా మిగిలిపోయింది. -
పోలీసుల తీరుపై వైఎస్ఆర్ సిపి ప్రజాప్రతినిధుల ఆగ్రహం
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అరెస్ట్
హైదరాబాద్ : శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సచివాలయం దగ్గర వున్న తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి... పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ఆ తరువాత.. పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. అటునుంచి అసెంబ్లీ వైపు పాదయాత్రగా వెళ్దామనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ప్రజాప్రతినిధులను గాంధీనగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయటానికి బాబు రాసిన లేఖే కారణమంటూ వైఎస్ఆర్ పార్టీ నేతలు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లోనూ వైఎస్ఆర్ సీపీ నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అరెస్ట్