telangana slogans
-
మళ్లీ అదే తీరు... అదే రచ్చ రచ్చ
న్యూఢిల్లీ : మళ్లీ అదే తీరు. అదే రచ్చ రచ్చ. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాల హోరు. సభలు ప్రారంభమవడమే ఆలస్యం వెంటనే వాయిదా. పార్లమెంట్ ఉభయ సభల్లో రెండో రోజు నెలకొన్న పరిణామాలివే. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల పోటా పోటీ నినాదాలతో ఉభయ సభలు అట్టుడికాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్సభ రెండంటే రెండే నిమిషాల్లో వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమైక్య నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఎంపీలు వెనక్కు తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం పార్లమెంట్ ఉభయ సభలు మళ్లీ ప్రారంభమైన తర్వాతా పరిస్థితుల్లో మార్పు రాలేదు. సీమాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. గందరగోళం మధ్యే సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై స్పీకర్ ప్రకటన చేశారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు స్పీకర్ వెల్ లోనికి దూసుకు పోయి నినాదాలు చేశారు. సభ్యులు ఎంతకూ వెనక్కు తగ్గక పోవడంతో స్పీకర్ మీరాకుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. వెంటనే ఛైర్మన్ సభను గంట పాటు వాయిదా వేశారు. 12 గంటలకు సభ మళ్లీ మొదలైన తర్వాత కూడా సీమాంధ్ర ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు. ఈ స్థితిలో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. -
ఉభయ సభలు వాయిదా
-
ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా
-
టీ బిల్లు పెట్టొద్దు
* లోక్సభలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం * సమైక్య నినాదాలతో దద్దరిల్లిన ఉభయసభలు * సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాల హోరు * అరగంటే సాగి నేటికి లోక్సభ వాయిదా * అసెంబ్లీ తిప్పి పంపిన బిల్లును తిరస్కరించాలి * లోక్సభ వెల్లోకి వెళ్లిన జగన్, మేకపాటి, ఎస్పీవై రెడ్డి * వారిని అనుసరించిన టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానికి చేరిన విభజన అంశంపై బుధవారం ఉభయసభలూ దద్దరిల్లాయి. సమైక్య, తెలంగాణ నినాదాలతో హోరెత్తాయి. దాంతో లోక్సభ అరగంట మాత్రమే నడిచింది. 15వ లోక్సభలో చివరివైన ఈ సమావేశాలు వాయిదాతో మొదలయ్యాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిప్పి పంపిన దృష్ట్యా ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టరాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు పార్టీ ఎంపీలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎస్పీవెరైడ్డిలు సభ ప్రారంభానికి గంట ముందే స్పీకర్కు తీర్మానాన్ని అందించారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సభ సజావుగా జరగని కారణంగా తీర్మానం చర్చకు రాలేదు. విభజన బిల్లును నిరసిస్తూ వైఎస్ జగన్, మేకపాటి, ఎస్పీవై బుధవారం సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రెండుమార్లు వెల్లోకి జగన్, ఎంపీలు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన నలుగురు మాజీ ఎంపీలకు సంతాప తీర్మానాన్ని స్పీకర్ ప్రవేశపెట్టారు. తర్వాత ప్రశ్నోత్తరాలు మొదలవగానే విభజన బిల్లును వ్యతిరేకిస్తూ జగన్, మేకపాటి, ఎస్పీవై రెడ్డి వెల్లోకి దూసుకెళ్లారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నినాదాలతో కార్యక్రమాలను అడ్డుకున్నారు. సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్ సూచించినా వెనక్కు తగ్గలేదు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు కూడా జగన్ను అనుసరించారు. కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, హర్షకుమార్, ఉండవల్లి అరుణ్కుమార్, సబ్బం హరి, టీడీపీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, కొనకళ్ల నారాయణ, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప వెల్లోకి వెళ్లి నినాదాలు చేశారు. కొందరు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, టీడీపీ సభ్యుడు రమేశ్ రాథోడ్ పోడియం ముందుకు వచ్చి తెలంగాణ అనుకూల నినాదాలు చేశారు. ఇవి చివరి సమావేశాలని, దయచేసి సహకరించాలని స్పీకర్ వేడుకున్నా లాభం లేకపోవడంతో సభను 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమవగానే జగన్ సహా మిగతా సభ్యులు తిరిగి వెల్లోకి వెళ్లి ఆందోళన కొనసాగించారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దాంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. అంతకుముందు అరుణాచల్ప్రదేశ్కు చెందిన విద్యార్థి నిడో తానియా హత్యోదంతంపై సభ కాసేపు చర్చించింది. రాజ్యసభలోనూ అదే సీను బుధవారం రాజ్యసభలోనూ సమైక్య నినాదాలు మిన్నంటాయి. తొలుత మాజీ సభ్యులు ముల్కా గోవిందరెడ్డి, ఎం.ఎం.హషీం, మన్మోహన్ మాథుర్ మరణంపై చైర్మన్ హమీద్ అన్సారీ సంతాప తీర్మానం చదివి వినిపించారు. ఆ వెంటనే సమైక్య నినాదాలతో సీమాంధ్ర ఎంపీలు పోడియం వద్దకు దూసుకురావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్లోకి రావద్దని హెచ్చరించారు. లాభం లేకపోవడంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనా సీమాంధ్ర ఎంపీల నిరసన కొనసాగింది. రాష్ట్రాన్ని విభజించవద్దని, ఆంధ్రప్రదేశ్ను పరిరక్షించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దాంతో సభ మరోసారి వాయిదా పడింది. 12.21కి తిరిగి సమావేశం కాగానే కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే మతహింస నిరోధక బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘కనీసం నేను మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఈ సమయంలో బిల్లెలా ప్రవేశపెడతారు?’ అని ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. అగస్టా వెస్ట్లాండ్ ఒప్పందంలో సోనియాగాంధీ పేరు ప్రస్తావనకు రావడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ) పట్టుబట్టారు. దానిపై బదులిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గందరగోళం పెరగడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ప్రారంభమయ్యాక కాసేపు మత హింస బిల్లుపై చర్చ జరిగింది. బిల్లును పెండింగ్లో పెడుతున్నట్టు సభాపతి పేర్కొన్నారు. అనంతరం సభ గురువారానికి వాయిదాపడింది. ఏ బిల్లునూ ఆమోదించనివ్వం: టీడీపీ ఎంపీలు రాష్ట్ర విభజన బిల్లుతో తలెత్తిన సమస్యను పరిష్కరించే వరకు ఏ బిల్లునూ ఆమోదించనివ్వమని టీడీపీ సీమాంధ్ర ఎంపీలు స్పష్టంచేశారు. పార్లమెంటు వెలుపల బుధవారం సీమాంధ్ర టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నారాయణరావు, నిమ్మల కిష్టప్ప మాట్లాడారు. అసెంబ్లీ ఆమోదం లేకుండా ఏ రాష్ట్ర విభజనా జరగలేదని గుర్తుచేశారు. రాజ్యాంగ ఉల్లంఘనలపై పునఃపరిశీలించి బిల్లును మళ్లీ అసెంబ్లీకి పంపాలని రాష్ట్రపతిని కోరారు. అసెంబ్లీ ఆమోదం తర్వాతే పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. టీకాంగ్రెస్ ప్రజాప్రతినిధులను పార్లమెంటులోకి అనుమతించి, సీమాంధ్ర టీడీపీ నేతలకు నిరాకరించడం శోచనీయమన్నారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గద్దర్ వేషధారణలో శివప్రసాద్... చేతిలో కర్ర.. భుజాన గొంగలితో.. సీమాంధ్ర టీడీపీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ప్రజాకవి గద్దర్ వేషదారణలో అందరి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనంతరం విజయ్చౌక్ వద్ద గద్దర్ గేయానికి శివప్రసాద్ పేరడి పాట పాడి అలరించారు ‘గోల్కొండ మనదిరా.. ఏడు కొండలు మనవిరా.., అన్నవరం మనదిరా .. అక్షర బాసర మనదిరా... సీమాంధ్ర, తెలంగాణ వేర్వేరు కాదు.., ఈ సోనియా ఏందిరో.. ఆమె జులుం ఏందిరో...’ అంటూ గేయాన్ని ఆలపించారు. రాజ్యసభ పక్ష నేతలతో జగన్ భేటీలు లోక్సభ వాయిదా పడ్డాక వైఎస్ జగన్, మేకపాటి, ఎస్పీవై, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి బృందం రాజ్యసభలో వివిధ పక్షాల నేతలు అరుణ్జైట్లీ (బీజేపీ), సంజయ్ రావత్ (శివసేన), డిరిక్ (తృణమూల్ కాంగ్రెస్) లతో విడివిడి గా భేటీ అయ్యారు. విభజన బిల్లును 10వ తేదీన రాజ్యసభలో పెడతారన్న వార్తల నేపథ్యంలో, దాన్ని అడ్డుకోవాలని విన్నవించారు. బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వారికి గుర్తుచేశారు. -
మూడోరోజూ అదే తీరు.. నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ
బిల్లుపై ఓటింగ్కు వైఎస్సార్సీపీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ప్రాంతాలవారీగా విడిపోయిన సభ్యులు చేసిన తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో బుధవారం శాసనసభ హోరెత్తిపోరుుంది. ఇరు ప్రాంతాల సభ్యులు ఒకేసారి పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తుండటంతో ఎలాంటి చర్చకు అవకాశం చిక్కలేదు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సభ వారుుదాల అనంతరం మధ్యాహ్నం రెండున్నర సమయంలో గురువారానికి వాయిదా పడింది. ఈ మధ్యలో కేవలం 9 నిమిషాల పాటు సభ కొనసాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే టీ బిల్లుపై వెంటనే ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లారు. ‘వుయ్ వాంట్ ఓటింగ్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ సభ్యులతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పోడియంను చుట్టుముట్టారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. మరోవైపు టీడీపీ సీమాంధ్ర నేతలు ప్లకార్డులు పట్టుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ చర్చలో పాల్గొనటం ద్వారా మనోభావాలను వెల్లడించాలని పదేపదే సూచించినా ఫలితం లేకుండా పోరుుంది. దీంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి 11.24కు సభ ప్రారంభం కాగానే అదే పరిస్థితి పునరావృతం కావటంతో కేవలం నిమిషానికే మళ్లీ వాయిదా పడింది. మళ్లీ రెండున్నరకు ప్రారంభమైనా పోడియం వద్ద నినాదాలు కొనసాగడంతో సుమారు 3 నిమిషాల తర్వాత సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. శాసనమండలి కూడా బుధవారం వాయిదాల పర్వంగానే ముగిసింది. -
మండలిలో నినాదాల హోరు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సోమవారం కొనసాగిన కొద్దిసేపూ సభ్యుల సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో మార్మోగిపోరుుంది. ఉదయం 10కి సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలు జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో ఐదు నిమిషాల్లోనే సభ వాయిదా పడింది. 12 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. పోడియంను చుట్టుముట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, దేవగుడి నారాయణరెడ్డి, జూపూడి ప్రభాకరరావు తదితరులు సమైక్య తీర్మానం చేయూలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో చైర్మన్ చక్రపాణి సభను మళ్లీ వాయిదా వేశారు. సభ మధ్యాహ్నం 1.45కి మళ్లీ ప్రారంభమైనా నినాదాలు కొనసాగడంతో మండలి మంగళవారానికి వాయిదా పడింది. నోటీసులు తిరస్కరించండి: వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన నోటీసును తిరస్కరించినట్టే సీఎం, మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసులను కూడా తిరస్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ కోరారు. ఆయన సోమవారం మండలి మీడియూ పారుుంట్లో సోమవారం మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ రూల్ 77 కింద నోటీసు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, విద్రోహచర్య అని అన్నారు. మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి కాదు: రామచంద్రయ్య పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ, మండలి తిరస్కరించాలని ప్రభుత్వం తరఫున నోటీసులివ్వడానికి మంత్రివర్గం ఆమోదం తీసుకోవాలన్న నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని మండలిలో సభా నాయకుడు, మంత్రి రామచంద్రయ్య అన్నారు. మంత్రివర్గం నాయకుడిగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. నోటీసులివ్వడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదన్నారు. -
దద్దరిల్లిన విద్యుత్సౌధ
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు, పోటాపోటీ ధర్నాలతో విద్యుత్సౌధ దద్దరిల్లింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పోటాపోటీగా ధర్నాలు నిర్వహించాయి. సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మరికొంత మంది కార్యకర్తలు సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా శిబిరం వైపు వెళ్లి జై తెలంగాణ నినాదాలు చేశారు. కొందరు మహిళా ఉద్యోగులు ప్రతిగా సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయిం చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి టీఆర్ఎస్ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఆర్. నాగరాజుగౌడ్, జగన్, సతీష్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారన్న వార్త తెలుసుకున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నినాదాలు చేస్తూ పెద్దఎత్తున సమైక్యాంధ్ర ఆందోళన శిబిరం వైపు పరుగులు తీశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కుట్రలకు నిలయంగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు దుయ్యబట్టారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ధర్నాలో ఆయన మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ ప్రకటించడంతోనే సీమాంధ్ర నేతల వికృత రూపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని ఢిల్లీ పెద్దలు చేతులు జోడించి చెప్పేవరకు ఉద్యమాన్ని ఆపొద్దని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన మన ఉద్యమం వల్లనే తోకముడిచిందని, ఇప్పుడు కూడా అదేస్ఫూర్తిని కొనసాగించాలని ఆయన కోరారు.