breaking news
Telangana Region leaders
-
ఇక ఓట్లు కొల్లగొడదాం!
మన వల్లే తెలంగాణ సాధ్యమైందని చెబుదాం బీజేపీ వ్యూహం ఖరారు.. ఢిల్లీ రైలు రాష్ట్రంలో ప్రవేశిస్తూనే ‘జైత్రయాత్ర’ సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ సాధన తమతోనే సాధ్యమైందన్న సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు బీజేపీ వ్యూహాన్ని రచిం చింది. బిల్లు లోక్సభ ఆమోదం పొందగానే మంగళవారం ఢిల్లీలో భేటీ అయిన తెలంగాణ ప్రాంత నేతలు పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేలా చేపట్టాల్సిన కార్యక్రమాన్ని ఖరారు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగరరావు, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగం జనార్దన్రెడ్డి, ప్రేమేందర్రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, టి.ఆచారి, మనోహర్రెడ్డి తదితరులు హాజరయ్యారు. బిల్లు ఆమోదం పొందడానికి తామే కారణమన్న విషయూన్ని ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాబట్టేలా కార్యక్రమాలు ఉండాలని భావించారు. దీనికనుగుణంగా పార్టీ నేతలందరూ ఢిల్లీ నుంచి 20వ తేదీ సాయంత్రం ఏపీ ఎక్స్ప్రెస్లో బయలుదేరుతారు. రైలు రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించిన వెంటనే దీన్ని జైత్రయాత్రగా మార్చాలని నిర్ణరుుంచారు. ఈ మేరకు రైలు ఆగే ప్రతి స్టేషన్లో కిషన్రెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. ఢిల్లీ నుంచి వస్తూనే ప్రతి నియోజకవర్గంలో యాత్రలు, పార్టీ పతాకావిష్కరణలు చేపడతారు. కాగా పార్టీకి తక్షణమే రెండు కమిటీలు వేయాలన్న సూచనను కిషన్రెడ్డి ఆమోదించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతలు జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ను కలిసి టీబిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా రాష్ట్ర విభజన విషయంలో ఏర్పడిన గందరగోళానికి కాంగ్రెస్దే బాధ్యతని వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై సంతోషపడుతున్నా.. సీమాంధ్రకు జరిగిన అన్యాయం బాధిస్తోందని చెప్పారు. రాజ్నాథ్తో టీ టీడీపీ నేతల మంతనాలు: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు రాజ్నాథ్ను కలిశారు. ఎమ్మెల్యేలు కె.దయాకర్రెడ్డి, సీతా దయాకర్రెడ్డి, ఎల్.రమణ, రేవూరి ప్రకాశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, రాములు తదితరులతో కలసి రాజ్నాథ్తో భేటీ అరుున సీనియర్ నేత ఎర్రబెల్లి దయూకర్రావు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ భేటీ తెలంగాణకు మద్దతిచ్చినందుకు కేవలం ధన్యవాదాలు చెప్పేందుకు మాత్రమే ఉద్దేశించిందని ఆయన చెప్పారు. అరుుతే ఈ సందర్భంగా రాజకీయపరమైన మంతనాలూ జరిపినట్టు సమాచారం. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ కుదేలైన నేపథ్యంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీలో చేరాలన్న అభిలాషను టీ టీడీపీ నేతలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. కిషన్రెడ్డి వీరికి రాజ్నాథ్ అపాయింట్మెంట్ ఇప్పించినట్లు సమాచారం. -
ఆట ముగిసింది.. ఆడుడుండదు!
వరంగల్/నిజామాబాద్/ భువనగిరి, న్యూస్లైన్: ‘ఆఖరి బంతి వేసే వరకు మ్యాచ్ ఉంటుంది. ఏమైనా జరగొచ్చు’ అని రాష్ట్ర విభజనను ఉద్దేశించి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత నేతలు అదే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. మ్యాచ్ ఎప్పుడో ముగిసింది. ఒకసారి ఆట ముగిసిన తర్వాత మళ్లీ ఆడుడుండదు.. అవసరమైతే రీప్లే చేసుకుంటారు అని వారు పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్రావు, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ గురువారం వేర్వేరు ప్రాంతాల్లో విలేకరులతో మాట్లాడారు. విభజనపై సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. విభజన ఆట ముగిసిందని, అందులో తెలంగాణ టీం గెలిచిందని శ్రీధర్బాబు వరంగల్ జిల్లా హన్మకొండలో వ్యాఖ్యానించారు. తెలంగాణపై అన్నిరకాల ఆలోచన చేసిన తరువాతే నిర్ణయం తీసుకున్నారని, ఇక మ్యాచ్ ముగిసినట్టేనని చెప్పారు. ఒకసారి ఆట ముగిశాక మళ్లీ ఆడుడుండదని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయానికి సీఎం సహా పార్టీ నాయకులందరూ బద్ధులై ఉండాలన్నారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరించిన వారందరిపై అధిష్టానం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పెవిలియన్ దారిపట్టే సమయం ఆసన్నమైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్రావు నిజామాబాద్లో చెప్పారు. సీమాంధ్ర నేతలు ఎన్ని మ్యాచ్ ఫిక్సింగులకు పాల్పడినా తెలంగాణ ఏర్పాటు ఆగదన్నారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ఎన్ని గూగ్లీలు, బౌన్సర్లు వేసినా ఫోర్లు, సిక్సర్లతో తెలంగాణవాదులు సమాధానం చెబుతారన్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన అని చెప్పుకుంటున్న కిరణ్కు లక్షణాలన్నీ సీమాంధ్రవేనని విమర్శించారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని, ఆరో జోన్లో భాగమని ఆనాడే ప్రకటించిన సీఎం ఇప్పుడు హైదరాబాద్పై చర్చ జరగాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో సీఎం కిరణ్ చెప్పిన ఆఖరిబంతి విషయం ఆయనకు కలగానే మిగిలిపోతుందని, ఆ ఒక్క బంతికి 10 పరుగులు చేయడం అసాధ్యమని టీఎన్జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్ నల్లగొండ జిల్లా భువనగిరిలో వ్యాఖ్యానించారు. విభజన ఆటలో తెలంగాణ విజయం ఖాయమైపోయిందని చెప్పారు. తెలంగాణలో సకల జనుల సమ్మె జరిగినప్పుడు హాజరు పట్టికలో సంతకం పెట్టకుండా అడ్డుకున్న ప్రభుత్వం ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.