Syria air strikes
-
సిరియాలో ఆగని నరమేధం; మళ్లీ బాంబుల వర్షం
-
సిరియాలో ఆగని నరమేధం
డమస్కస్ : కల్లోల సిరియాలో నరమేధం ఇంకా ఆగలేదు. అంతర్జాతీయ సమాజం అభ్యర్థను పక్కనపెడుతూ, ఐక్యరాజ్యసమితి ఆదేశాలను బేఖాతరుచేస్తూ సిరియా సైన్యం మరోసారి వైమానిక దాడులు జరిపింది. తూర్పుగౌటాలోని నివాస సముదాయాలపై శుక్ర, శనివారాల్లో బాంబుల వర్షం కురిపించింది. తాజా దాడుల్లో 25 మందికిపైగా పౌరులు చనిపోయారు. ప్రస్తుతం తూర్పు గౌటాలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలు ఏజెన్సీలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కాల్పుల విరమణకు విరుద్ధంగా : ఫిబ్రవరి చివరివారంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి.. ‘తూర్పుగౌటాపై దాడులను తక్షణమే నిలిపేయాలి’ అని ఏకగ్రీవ తీర్మానం చేసింసింది. నెల రోజుల కాల్పులు జరపరాదంటూ సిరియా-రష్యాలను ఆదేశించింది. ఆ నిర్ణయం తర్వాత పలు స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. మూడు నెలలుగా సరైన ఆహారం, వైద్యసేవలు లేక అలమటిస్తోన్న గౌటా వాసులను ఆదుకునే ప్రయత్నం చేశాయి. ఇంతలోనే కాల్పుల విమరణ ఒప్పందానికి విరుద్ధంగా అసద్ సైన్యాలు మళ్లీ జనావాసాలపై దాడులకు తెగబడ్డాయి. సేవ్ సిరియా : రాజధాని డమస్కస్కు తూర్పుభాగంలో ఉండే గౌటా నగరంపై గడిచిన మూడు నెలలు భీకర దాడులు జరిగాయి. ఫిబ్రవరి 19 తర్వాత సిరియా సైన్యం-రష్యన్ వైమానిక దళాలు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 200 చిన్నారులు, 150 మంది మహిళలు సహా మొత్తం 700 మంది వరకు చనిపోయారు. మరో 1500 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు దాడుల్లో 25కుపైగా ఆస్పత్రి భవనాలు కుప్పకూలడంతో వైద్యం చేయించుకునే దిక్కులేక జనం అల్లాడిపోయారు. సిరియన్ బాలల ఆర్తనాదాలకు చలించిన మిగతా ప్రపంచం ‘సేవ్ సిరియా’ అంటూ గట్టిగా నినదించింది. ఈ నేపథ్యంలోనే సిరియా సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడం తెలిసిందే. -
సిరియాలో రక్తమోడుతున్న బాల్యం
-
సిరియాలో బాంబుల వర్షం : 200 మంది హతం
-
సిరియాలో మళ్లీ నరమేధం
బీరుట్ : గత కొన్నేళ్లుగా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు గౌటా ప్రాంతంపై సిరియన్ ఆర్మీ ఆది, సోమవారాల్లో బాంబుల వర్షం కురిపించడంతో ఏకంగా రెండు వందల మంది పౌరులు మృత్యువాతపడ్డారు. వీరిలో 57 మందికిపైగా చిన్నారులు ఉన్నారు. 300 మందికి గాయాలయ్యాయి. సిరియాలోని ఓ మానవ హక్కుల పరిశీలన సంస్థ ఈ మేరకు వివరాలను వెల్లడించింది. కేవలం సోమవారం నాటి దాడుల్లోనే 127 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. భారీ సంఖ్యలో క్షతగాత్రులకు సరిపడా పడకలు లేకపోవడంతో బాధితులకు చికిత్స చేయడం కష్టసాధ్యంగా మారుతోందని డాక్టర్లు తెలిపారు. డమాస్కస్ శివార్లలో 2015 తర్వాత జరిగిన అతి పెద్ద దాడులు ఇవేనని మానవ హక్కుల పరిశీలన సంస్థ చీఫ్ రమి అబ్దెల్ రెహమాన్ తెలిపారు. గౌటాలో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పిందని చెప్పారు. దాదాపు నాలుగు లక్షల జనాభా కలిగిన ఈ ప్రాంతంలో మరోసారి భారీ దాడికి అవకాశం ఉందని అల్–వతన్ పత్రిక తెలిపింది. తూర్పు గౌటా ప్రాంతం 2012 నుంచి రెండు ఉగ్రవాదసంస్థల ఆధీనంలోనే ఉంది. డమాస్కస్ శివారు ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిరియా అధ్యక్షుడు బషర్ అల్–అసద్ సైన్యాన్ని పంపించారు. దీంతో పలు పట్టణాలపై సైన్యం విమానాలతో దాడులు చేపట్టింది. ఈ నెల మొదట్లో కూడా ప్రభుత్వ బలగాలు తిరుగుబాటు దారులపై ఐదు రోజుల పాటు చేపట్టిన దాడుల్లో 250 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందిస్తూ పౌరుల హత్యలను తక్షణం ఆపేయాలని సిరియా ప్రభుత్వాన్ని కోరింది. -
ఫేస్బుక్లో ఎంపీకి బెదిరింపులు!
లండన్: ఫేస్బుక్లో సందేశాలు పంపుతూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని యూకే పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమకు ప్రాణాపాయం ఉందని లేబర్ పార్టీ ఎంపీలు సిమన్ డాన్క్జుక్, నెయిల్ కోలేలు ఇటీవలే ఫిర్యాదు చేశారు. గత మూడు, నాలుగు రోజుల నుంచి యూకేకి చెందిన పార్లమెంట్ సభ్యులకు బెదిరింపు సందేశాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని క్రేయిగ్ వాల్లేస్ అలియాస్ మమమ్మద్ ముజాహిద్ ఇస్లామ్ అని గుర్తించారు. సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో హెచ్చరింపు మెస్సేజ్లు చేస్తున్న నిందితుడు ముజాహిద్ ని పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోనికి తీసుకున్నారు. హెండన్ మేజిస్ట్రేట్ ఎదుట సోమవారం నిందితుడిని హాజరుపరచనున్నట్లు వారు తెలిపారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై యూకే చేపట్టిన దాడులను ముమ్మరం చేయాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ప్రకటించిన తర్వాత ఎంపీలపై బెదిరింపు చర్యలు అధికమయ్యాయి. గత గురువారం నాడు వాల్లేస్ ఫేస్బుక్ నుంచి ఎంపీకి చేసిన ఓ మెస్సేజ్ సాక్ష్యాధారంగా చేసుకుని ఆదివారం అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, నిందితుడు ఏ పార్లమెంట్ సభ్యుడికి సందేశాలు పంపించాడన్న వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. లండన్ నియోజకవర్గం సభ్యుడు అయితే కాదని మాత్రం స్పష్టంచేశారు.