-
గంగూలీకి మరో రెండు స్టెంట్లు
కోల్కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి గురువారం వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఛాతీలో అసౌకర్యంతో బుధవారం ఆసుపత్రిలో చేరిన ఆయనకు తాజాగా రెండు స్టెంట్లు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ‘కరోనరీ ఆర్టినరీ పూడికలను తొలగించేందుకు గంగూలీకి అదనంగా రెండు స్టెంట్లు అమర్చాం. ప్రస్తుతం ఆయనను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం. ఆపరేషన్కు ముందు పలు వైద్య పరీక్షలు నిర్వహించాం’ అని వారు తెలిపారు. 48 ఏళ్ల గంగూలీ ఈ నెలలో రెండు సార్లు ఆసుపత్రి పాలయ్యారు. జనవరి 2న స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ ద్వారా ఒక స్టెంట్ను అమర్చారు. తాజాగా మరోసారి ఛాతీలో అసౌకర్యం ఏర్పడటంతో ఇంకో రెండు స్టెంట్లు వేశారు. -
స్టెంట్ కేరాఫ్ సిటీ
సాక్షి, హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కానుంది. నగర శివార్లలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250 కోట్ల భారీ పెట్టుబడితో స్టెంట్ల తయారీ పరిశ్రమను నెలకొల్పుతున్నట్లు సహజానంద మెడికల్ టెక్నాలజీస్ (ఎస్ఎంటీ) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. హృదయ సంబంధిత రోగాలకు జరిపే శస్త్రచికిత్సల్లో వినియోగించే పరికరాల (మినిమల్లీ ఇన్వేసివ్ లైఫ్ సేవింగ్ మెడికల్ డివైజెస్)ను తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భార్గవ్ కటడియా మంగళవారం ఇక్కడ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్లతో సమావేశమై ఈ మేరకు ప్రతిపాదనలు చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 2,200 మందికి, పరోక్షంగా వందల మందికి ఉపాధి లభించనుంది. మూడు దశల్లో పరిశ్రమ స్థాపనకు పెట్టుబడి పెట్టనుంది. ఏటా ఈ పరిశ్రమ నుంచి 12.5 లక్షల స్టెంట్లు, 20 లక్షల బెలూన్ కాథెటర్స్ ఉత్పత్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సత్వర అనుమతులు, నగరంలో మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు కంపెనీ ఎండీ భార్గవ్ కటడియా పేర్కొన్నారు. ప్రస్తుతం సూరత్ కేంద్రంగా తమ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వైద్య పరికరాల ఉత్పత్తి రంగంలో రానున్న రోజుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. పరిశ్రమలు, పెట్టుబడులను రాబట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అభినందించారు. భవిష్యత్లో వైద్య పరికరాల ఉత్పత్తిలోనూ అగ్రస్థానం: కేటీఆర్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్య పరికరాల ఉత్పత్తి రంగంలో భారీ పరిశ్రమ రాష్ట్రానికి రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఔషధ రంగంలో ఇప్పటికే హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని, భవిష్యత్లో వైద్య పరికరాల ఉత్పత్తిలో సైతం అగ్రగ్రామిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ రావడంతో భవిష్యత్లో ఈ రంగంలో పెట్టుబడులకు నగరం ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
స్టెంటు.. బిల్లులో స్టంటు
►ధరలు తగ్గినా మారని బిల్లు ►రోగుల జేబుకు కార్పొరేట్ చిల్లు ►కొరవడిన నియంత్రణ ►ప్రొసీజర్ల పేరిట అదనపు బాదుడు ►లబోదిబోమంటున్న రోగులు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స సమయంలో అమర్చే స్టెంట్లు కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు కాసులు కురిపిస్తున్నాయి. రాయలసీమలో మెడికల్ హబ్గా పేరొందిన తిరుపతిలో కొంతకాలంగా ఈ దోపిడీ జరుగుతోంది. ఇటీవల కాలంలో స్టెంట్ల ధరల విషయంలో కేంద్రం స్పందించింది. ధరల స్థిరీకరణకు అన్ని చర్యలు తీసుకుంది. అయినా ఇక్కడ స్టెంట్ల విషయంలో మార్పు లేదు. స్టెంట్ల ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించినా కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల తీరు మాత్రం మారడం లేదు. పాత స్టెంట్లను అమర్చుతూ అదేధరను వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం క్రితం తిరుపతికి చెందిన ఓ ఉద్యోగి(45 )కి గుండె పోటు రావడంతో అర్ధరాత్రి నగరంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో పూడికను తొలగించే (యాంజియోప్లాస్టీ) ఆపరేషన్ చేయాలన్నారు. దీనికి ఖరీదైన స్టెంట్లు పెట్టాలని అందుకు రూ.1.60లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి డిశ్చార్జీ అయ్యేలోగా దాదాపు రూ.2.40 లక్షల వరకు పిండేశారు. పీలేరుకు చెందిన ఓ మహిళ (30)కు గుండె నొప్పి రావడంతో అత్యవసర వైద్యం కోసం తిరుపతిలోని ఓ పేరున్న ప్రయివేట్ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు రక్తాన్ని తొలగించాలని వైద్యులు తెలిపారు. అత్యవసర వెద్యం పేరుతో రూ.1.80 లక్షల విలువ చేసే స్టెంట్స్ ఆపరేషన్ చేసినా ప్రొసీజర్స్ పేరుతో రూ.2.25 లక్షలు బిల్లు ఇచ్చారు. తలకుమించిన భారమైనా అప్పు చేయకతప్పలేదు. తిరుపతి మెడికల్: గుండె ఆపరేషన్లలో వినియోగించే స్టెంట్స్ పరికరం గతంలో చాలా ఖరీదు ఉండేది. రూ.90 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు కూడా వివిధ కంపెనీల స్టెంట్లు ఉన్నాయి. వీటి గురించి సరైన అవగాహన రోగులకు లేకపోవడంతో ఎక్కువ రేటును ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్టెంట్ల ధరలను స్థిరీకరించి తగ్గించింది. రూ.90వేలకు దొరికే స్టెంట్ ధర ప్రస్తుతం అన్ని రకాల పన్నులతో కలిపి రూ.31,800 లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కసారిగా 70 శాతం ధరలు తగ్గిపోయిందని భావిస్తే పొరబాటే. తిరుపతిలోని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు వీటి విషయంలో తమ ధోరణి మార్చుకోలేదు. స్టెంట్ల, ప్రొసీజర్స్ బిల్లులు వేరువేరుగా ఇవ్వాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. స్టెంట్ ధర తగ్గినా బిల్లు బాదుడు నుంచి ఉపశమనం కలగడం లేదని రోగులు వాపోతున్నారు. ఇటీవలే స్టెంట్లపై ధరను కచ్చితంగా ముద్రించాలని ఔషధ నియంత్రణ మండలి స్పష్టం చేసింది కూడా.. అయినా ఆస్పత్రులకు ఇవేమీ పట్టడం లేదు. ఇక్కడి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మందుపూత స్టెంట్ను ఎక్కువగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వినియోగిస్తారు. ప్రస్తుతం మందుపూత స్టెంట్తోపాటు అత్యాధునికమైన రక్తనాళాల్లో కరిగిపోయే స్టెంట్ను ఉపయోగిస్తున్నారు. మందుపూత స్టెంట్ రూ.30 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ధర ఉంటే, కరిగిపోయే స్టెంట్ ధర మాత్రం రూ.1.60 లక్షల వరకు ధర ఉంటోంది. సాధారణ స్టెంట్లు (కరగకుండా ఉండే) రూ.68వేలు, రూ.80 వేలు, రూ.90వేలు చొప్పున అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా వినియోగిస్తున్నారు. స్టెంట్ను ప్రభుత్వం సూచించిన విధంగా రూ.31,800 వేలకు విక్రయిస్తున్నట్లు కొన్ని ఆస్పత్రులు చెబుతున్నా మరో రూపంలో ఆ లోటును భర్తీ చేసుకుంటున్నాయి. ప్రొసీజర్స్ పేరుతో దోపిడీ చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టెంట్ ధర బిల్లులో రూ.31,800 వేసినా, వివిధ రకాల సేవల పేరుతో రూ.1.60 నుంచి 2.10 లక్షలు వరకు వసూలుచేస్తున్నారు. రోగి ఆర్థిక స్థితిని బట్టి కూడా చేతివాటం చూపిస్తున్నారని ఆరోపణలున్నాయి. పాత స్టెంట్లను వేస్తూ అదే ధర వసూలు చేస్తున్నాయనే వాదన కూడా ఉంది. స్విమ్స్లో ఇందుకు భిన్నం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్లో స్టెంట్లు, ఆంజియోప్లాస్టీ, ఫేస్మేకర్, వాల్వ్ వంటి గుండె ఆపరేషన్లు ఏడాదికి 5వేల వరకు చేస్తున్నారు. సగటున రోజుకు 5 స్టెంట్ల ఆపరేషన్లు చేస్తున్నారు. స్విమ్స్లో 99 శాతం ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా రూ.65వేలు విలువైన స్టెంట్ల ఆపరేషన్లను క్యాష్లెస్ పేరుతో అందిస్తోంది. ప్రభుత్వం సూచించిన రూ.31,800 ధరలకు స్టెంట్ ధర నిర్ణయిస్తే స్విమ్స్లో కొన్నేళ్లుగా రూ.23,625లకే స్టెంట్లను రోగులకు అందించడం విశేషం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement