breaking news
status co
-
హిల్ట్ పాలసీపై స్టే ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాడ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పీ)పై స్టేటస్కో ఆదేశాలు జారీ చేసేందుకు నిరాకరించింది. అయితే పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ఎండీ, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. హైదరాబాద్లోని పలు పారిశ్రామికవాడల్లోని 9,292.53 ఎకరాల భూములను క్రమబద్దీకరించి, వాణిజ్య, నివాస వినియోగంగా మార్చడానికి ప్రభుత్వం ఈ విధానం తీసుకొచి్చంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 27ను సవాల్ చేస్తూ రిటైర్ట్ ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డితో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ శామ్కోషి, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు లేదు.. హిల్ట్ పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలని పార్టీ ఇన్ పర్సన్గా పాల్ వాదనలు వినిపించారు. పురుషోత్తంరెడ్డి తరఫున న్యాయవాది కె.ప్రతీక్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో సీనియర్ న్యాయవాది వివేక్రెడ్డి వాదనలు వినిపించారు. ‘హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ను సవరించకుండా పారిశ్రామిక భూములను వినియోగించే విధానాన్ని (ల్యాండ్ యూజ్) మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా హిల్ట్పీ జీవో ఉంది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) చేయకుండానే వేలాది ఎకరాల్లోని పారిశ్రామిక భూములను నివాస స్థలాలుగా (రెసిడెన్షియల్ జోన్)గా మార్పు చేయడం దారుణం. ఇలాంటి నిర్ణయం అమల్లోకి వస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. మాస్టర్ ప్లాన్ సవరణ చేయకుండా, ప్రజల అభ్యంతరాలను స్వీకరించకుండా జీవో జారీ సరికాదు. దరఖాస్తులను ఆహ్వానించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించినందున తాజా జీవోను నిలిపివేయాలి’అని కోరారు. సర్కార్ నిర్ణయాన్ని ప్రశంసించాల్సిందిపోయి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వివేక్ రెడ్డి వాదనలను తోసిపుచ్చారు. ‘హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించాల్సింది పోయి పిటిషన్లు వేసి అడ్డుకోవాలని చూడటం సరికాదు. బాలానగర్, కాటేదాన్, కూకట్పల్లిలోని కాలుష్యకారక పరిశ్రమలను జీహెచ్ఎంసీ పరిమితుల నుంచి తరలించే వరకు, పారిశ్రామిక భూమిని మరే ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి సర్కార్ అనుమతించదు. మాస్టర్ ప్లాన్ను సవరించే ముందు ప్రజల నుంచి అభ్యంతరాలను ప్రభుత్వం కోరుతుంది..’అని వెల్లడించారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరిస్తూ విచారణ వాయిదా వేసింది. -
ఆర్బీఐ పాలసీ రివ్యూ : కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా నాలుగోసారి వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రివ్యూలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ గవర్నరు శక్తి కాంతదాస్ శుక్రవారం వెల్లడించారు. ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించిందని ఆయన ప్రకటించారు. (పెట్రో ధరల మోత : రికార్డు హై) వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అలాగే ద్రవ్యోల్బణం అంచనాను 5.8శాతం నుంచి 5.2శాతానికి తగ్గించారు. తాజా నిర్ణయంతో రెపోరేటు 4 శాతంగా, రివర్స్ రెపో 3.35 శాతంగా కొనసాగనుంది. దీంతో బ్యాంకు నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతుండటం విశేషం. (అదే జోష్, అదే హుషారు : పరుగే పరుగు) -
ట్రైనీ ఐఏఎస్ల కేటాయింపులపై స్టేటస్కో
సాక్షి, హైదరాబాద్: శిక్షణలో ఉన్న అఖిల భారత సర్వీసు అధికారులు తుమ్మల సృజన, శివశంకర్లను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడంపై యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. చిత్తూరు, విజయనగరం జిల్లాలకు చెందిన తమను ఆంధ్రప్రదేశ్కు కాకుండా తెలంగాణకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లుగా(ట్రైనీ) పనిచేస్తున్న సృజన, శివశంకర్లు దాఖలు చేసిన పిటిషన్ను క్యాట్ సభ్యులు వెంకటేశ్వర్రావు, రంజనాచౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. సొంత జిల్లాలను శాశ్వత నివాసంగా తీసుకొని తమను ఏపీలో కొనసాగించాల్సి ఉన్నా... అందుకు విరుద్ధంగా తెలంగాణకు కేటాయించారని పిటిషనర్లు కోరారు.


