breaking news
State Department Spokesperson
-
సీఏఏ అంతర్గత వ్యవహారం
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ బహుళ సంప్రదాయాలను, దేశ విభజన తర్వాత ఇక్కడి చరిత్రను అర్థం చేసుకోలేనివారు తమకు పాఠాలు చెప్పొద్దని చురక అంటించారు. పౌరసత్వ సవరణ చట్టం తమ దేశ అంతర్గత వ్యవహారమని హితవు పలికారు. ఇక్కడ మైనారీ్టలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. పొరుగుదేశాల్లో మతహింసకు, వేధింపులకు గురై, వలస వచి్చన ముస్లిమేతరులకు పౌరసత్వం కలి్పంచేందుకు సీఏఏ తెచ్చామన్నారు. సీఏఏపై మాథ్యూ చేసిన వ్యాఖ్యలపై ఇండియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఇండియాలో సీఏఏను ఎలా అమలు చేయబోతున్నారన్నది గమనిస్తున్నాం. అన్ని మతాల స్వేచ్ఛను గౌరవించాలి. చట్ట ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడడం అనేది ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రం’ అని మిల్లర్ వ్యాఖ్యానించారు. -
సమీక్ష దశలోనే దేవయాని దరఖాస్తు: అమెరికా
వాషింగ్టన్: వీసా మోసం అభియోగాలను ఎదు ర్కొంటున్న భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత కార్యాలయానికి చేసుకున్న బదిలీ దరఖాస్తును ఇంకా సమీక్షిస్తున్నట్లు అమెరికా తెలిపింది. అలాగే పూర్తి దౌత్య రక్షణకు సంబంధించిన పత్రాలను జారీ చేసే అంశం కూడా పరిశీలనలో ఉందని పేర్కొంది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు నిర్ణీత గడువేమీ లేదని...సమీక్ష ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి ఒకరు చెప్పారు. డిసెంబర్ 20న దేవయాని దరఖాస్తు అమెరికా విదేశాంగశాఖకు అందగా ఇప్పటివరకూ ఆ శాఖ ఆ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.