breaking news
staff quarters
-
ఢిల్లీ: ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీ: ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. చిన్నారులు టపాసులు కాలుస్తుండగా ఫర్నీచర్కి మంటలు అంటుకోవడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. బీడీ మార్గ్లోని ఈ అపార్ట్మెంట్.. పార్లమెంట్ హౌస్కు కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో మూడు అంతస్తులు దగ్ధమయ్యాయి. ప్రాణ నష్టం తప్పింది. పలువురికి గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదం ఫోన్ కాల్ తర్వాత 40 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నట్లు తెలిసింది. ఆలస్యంగా రావడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు అంటున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా బాణాసంచా కారణమని స్థానికులు చెబుతున్నారు. పార్కింగ్ ఏరియాలో ఫర్నిచర్ ఉంచడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. సీపీడబ్ల్యూడి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అపార్ట్మెంట్ వాసుల ఆరోపిస్తున్నారు. #WATCH | A fire broke out at Brahmaputra Apartments in New Delhi. Six vehicles have been dispatched to the spot. Efforts are underway to put out the fire. https://t.co/QfqJWbteUi pic.twitter.com/0RY9JOzGbq— ANI (@ANI) October 18, 2025 -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
- డీఆర్ఎం ప్రసాద్ - పిడుగురాళ్ళ రైల్వేస్టేషన్లో వసతులపై ఆరా పిడుగురాళ్ల: ఆదర్శ రైల్వేస్టేషన్ అయిన పిడుగురాళ్లలో ప్రయాణికులకు మెరగైన సౌకర్యాలను అందజేసేందుకు తగు చర్యలు చేపడతామని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక రైల్వేస్టేషన్కు అధికారుల బృందంతో వచ్చిన డీఆర్ఎం తొలుత రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలపై ఆరాతీశారు. స్టేషన్మాస్టర్ కె.వరకృపాకరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన బోరింగు పంపులను, వెయిటింగ్హాలు, సిబ్బంది క్వార్టర్లను పరిశీలించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తగుచర్యలు తీసుకోవాలని, పాడైన బోరింగు పంపులను, నీటి కుళాయిలను తక్షణమే బాగుచేయించాలని ఆదేశించారు. గాంధీనగర్వద్దనున్న మొండిగేటును డీఆర్ఎం పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పక్కనే జానపాడురోడ్డులో రైల్వే గేటు ఉన్నందున సమీపంలోని గాంధీనగర్ మొండిగేటుకు గేటు ఏర్పాటు సాధ్యం కాదని, అందుకే అక్కడ కాపలాకు ఉద్యోగిని నియమించామన్నారు. ఆ ఉద్యోగి సక్రమంగా విధులు నిర్వర్తించేవిధంగా అధికారులు పర్యవేక్షించాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం రైల్వేస్టేషన్ పరిసరాల్లో వివిధ సమస్యలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలపై డీఆర్ఎం ప్రసాద్ అసహనం వ్యక్తంచేశారు. డీఆర్ఎం వెంట ఏసీఎం అలీఖాన్, అధికారులు సతీష్, ఎంఎం ఖాన్ తదితరులు ఉన్నారు.