భారత్లోకి జోపో తొలి మొబైల్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ జోపో తొలిసారిగా ‘స్పీడ్ 7’ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.12,999. ఈ స్మార్ట్ఫోన్లో 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్, 4జీ, 3 జీబీ ర్యామ్, 5 అంగుళాల తెర, 16 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ల విక్రయాల కోసం స్నాప్డీల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జోపో వచ్చే ఏడాది కాలంలో భారత్లో 10 లక్షల యూనిట్ల హ్యాండ్సెట్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.