breaking news
sensor issue
-
డేట్ ఫిక్స్
రామ్గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రేక్షకుల ముందుకు రానున్న తాజా చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. రామ్గోపాల్వర్మతో కలిసి సిద్దార్ధ తాతోలు దర్శకత్వం వహించిన చిత్రం ఇది. టి. అంజయ్య సమర్పణలో అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ నిర్మించారు. రివైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఏ వర్గాన్నీ టార్గెట్ చేసిన చిత్రం కాదు ఇది. ఫ్యాక్షనిజమ్, రౌడీయిజమ్, రాజకీయాల నేపథ్యంలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’’ అని చిత్రబృందం వెల్లడించింది. నట్టి క్రాంతి, నట్టి కరుణ ఈ చిత్రానికి సహనిర్మాతలు. -
అలా చూస్తే ఏ సినిమా విడుదల కాదు
‘‘సెన్సార్ బోర్డ్ రూల్ ప్రకారం చూస్తే ఏ సినిమా కూడా విడుదల కాదు. సెన్సార్ వాళ్లు అన్ని రూల్స్ను నా సినిమా మీదే ప్రయోగిస్తున్నారు. ఎందుకో అర్థం కావడం లేదు. ఓటు వేసి మనకు కావాల్సిన నాయకులను ఎన్నుకునే జ్ఞానం ఉన్న మనకు ఏ సినిమా చూడాలో? చూడకూడదో తెలియదా? ఆ విషయాన్ని ఇద్దరు, ముగ్గురు సెన్సార్ వాళ్లు చూసి చెప్పాలా? నా దృష్టిలో సెన్సార్ అనేది అవుట్ డేటెడ్’’ అన్నారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్గోపాల్ వర్మ అందిస్తున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టి. అంజయ్య సమర్పణలో అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా, సెన్సార్ కారణాల వల్ల కాలేదు. ఈ సినిమా పేరును ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’గా మార్చారు. రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘ఏ విషయాన్నీ సీరియస్గా తీసుకోవద్దనే సందేశంతో ఈ సినిమా రూపొందించాం. ఇందులో ఏ కులాన్ని, ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపలేదు. వైఎస్ జగన్ మోహన్రెడ్డిగారి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేశాను. ఎవరినైనా ప్రేమించడానికి లేదా ద్వేషించడానికి నా దగ్గర సమయం లేదు. నన్ను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా పైకి లేస్తాను.. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. చిత్ర సహనిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ –‘‘మా సినిమాను నవంబర్ 29న విడుదల చేయాలంటే అర్జెన్సీ సర్టిఫికెట్ కావాలన్నారు. దాన్ని పొందుపరిచి నవంబర్ 14న సెన్సార్కి పంపించాం. ఎలాంటి కారణం చూపకుండా సెన్సార్ వారు ఇంతవరకూ సినిమా చూడలేదు. అందుకే కోర్టును ఆశ్రయించడంతో వారంలోపు సినిమా చూసి, ఎగ్జామినేషన్ చేయాలని ఆదేశాలిచ్చారు’’ అన్నారు. ‘‘నిర్మాతగా నా తొలి చిత్రమిది. ఎవర్నీ కించపరిచేలా ఉండదు’’అన్నారు అజయ్ మైసూర్. ఈ చిత్రానికి సహ నిర్మాత: నట్టి కరుణ. -
సౌత్ క్వీన్కు కత్తెర్లు
‘‘మా కష్టాన్ని వృథా చేయకండి’’ అని వాపోతున్నారు కాజల్ అగర్వాల్. రమేష్ అరవింద్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్యారిస్ ప్యారిస్’. హిందీ హిట్ చిత్రం ‘క్వీన్’కు ఇది తమిళ రీమేక్. ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి పాతిక కత్తెర్లు ఇచ్చింది సెన్సార్ బోర్డ్. దీంతో ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రబృందం రివైజింగ్ కమిటీకి వెళ్లింది. ఇటీవల ఈ విషయంపై కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందిస్తూ –‘‘హిందీ ‘క్వీన్’ చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకులకు చూపించాలని ఓ మంచి ప్రయత్నం చేశాం. కానీ సెన్సార్ వారు ఇన్ని కట్స్ చెప్పారన్నప్పుడు షాకయ్యాను. వారు చెప్పిన కట్స్లో చాలా సన్నివేశాలు మన నిత్య జీవితంలో జరిగేవే ఉన్నాయి. ఈ విషయమే నిర్మాతలకూ చెప్పి సరైన యాక్షన్ తీసుకోమని కోరాను. ఈ సినిమా కోసం చాలా కాలం సమష్టిగా కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ఫలాన్ని అందుకోవాలనుకుప్పుడు ఇలా జరుగుతోంది. ఎటువంటి సెన్సార్ కట్స్ లేకుండానే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. హిందీ ‘క్వీన్’ చిత్రం తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’గా మలయాళంలో ‘జామ్ జామ్’గా, కన్నడలో ‘బటర్ఫ్లై’గా రీమేక్ అయ్యాయి. ‘జామ్ జామ్’, ‘బటర్ ఫ్లై’ చిత్రాలకు సెన్సార్ బోర్డ్ యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. -
డర్టీ పిక్ఛర్
-
వైశ్రాయ్ ఘటనే పెద్ద కుట్ర
‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 29న విడుదల చేస్తున్నాం. సెన్సార్ సమస్య వల్ల విడుదల వాయిదా పడలేదు. మా సినిమా విడుదలకు కోర్టు, ఎలక్షన్ కమిషన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చాయి. ఎన్నికలు అయిపోయేవరకూ మా చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వరంటూ మాకు సమాచారం అందడంతో బోర్డుపై కేసు పెట్టాలనుకున్నాం. అయితే అలాంటిదేమీ లేదని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నాం’’ అని రామ్గోపాల్ వర్మ అన్నారు. విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి లీడ్ రోల్స్లో రామ్గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో వర్మ పంచుకున్న విశేషాలు... బాలకృష్ణకి అంకితం ఎన్టీఆర్గారి బయోపిక్ చేద్దామని బాలకృష్ణ అన్నారు. పొలిటికల్ విషయాలు తెలుసుకునేందుకు ఆయనే కొందరు వ్యక్తుల్ని నాకు పరిచయం చేశారు. ఎన్టీఆర్గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక జరిగిన ఘటన లేకుండా చేద్దామని బాలకృష్ణ అన్నారు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో మా కాంబినేషన్లో సినిమా ఆగిపోయింది. అయితే బాలకృష్ణ నన్ను సంప్రదించకపోయి ఉంటే మాత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఐడియా నాకు వచ్చేది కాదు. అందుకే గతంలో ప్రెస్మీట్లో చెప్పినదే మళ్లీ చెబుతున్నా.. ఈ సినిమా బాలకృష్ణకే అంకితం. నా కెరీర్లో చాలా ప్రత్యేకం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా అని ఎందుకు అంటున్నానంటే.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన తెలుగు వ్యక్తి ఎన్టీఆర్గారు. అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారాయన. అలాంటి వ్యక్తి జీవితంలో జరిగిన ఎక్స్ట్రీమ్ ట్రాజెడీని తెరకెక్కించడం డిఫికల్ట్, ఎమోషనల్ టాస్క్. దాన్ని జస్టిస్ చేయడం చాలా పెద్ద బాధ్యత. దాన్ని గుర్తు పెట్టుకునే ఎన్టీఆర్గారి వ్యక్తిత్వానికి ఏమాత్రం అగౌరవం కలగకుండా ఈ సినిమా తీశా. నేను నమ్మిన నిజంతో... ‘వైశ్రాయ్ హాటల్’ సంఘటన జరిగినప్పుడు నేను ‘రంగీలా’ సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా. 25ఏళ్ల కిందట జరిగిన ఆ ఘటనలో వాస్తవం ఏంటన్నది నాకు తెలియదు. ఆ సంఘటన జరిగినప్పుడు రాజకీయాల్లో ఉండి, ప్రస్తుతం లైమ్లైట్లో లేని దాదాపు 35మందిని కలిసి ఏం జరిగిందన్నది తెలుసుకుని, నేను నిజమని నమ్మిన దాంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తీశా. నా మాటను నమ్మని వాళ్లకు సినిమాటిక్గా అనిపించవచ్చు. ఈ సినిమా చూశాక ‘ఇలా జరగలేదు’ అనుకుంటే వారు నమ్మినదాన్ని సినిమా తీసుకోవచ్చు. నిజం బయటకు వస్తుందని భయం మాఫియా నేపథ్యంలో బాలీవుడ్లో సినిమాలు తీసినా వివాదాలు లేవు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో మాత్రం వివాదాలు రావడానికి కారణం నిజం బయటకు వస్తుందని, ఇంతకు ముందెప్పుడూ తెలియని నిజాలు ఇప్పుడు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయేమోననే భయం. అందుకే సినిమా విడుదల కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అవతలివారి దగ్గరే నిజం ఉంటే, సినిమాని ఆపడానికి ఎందుకు ప్రయత్నించాలి? లక్ష్మీపార్వతిగారు వచ్చాకే... ఈ సినిమాని లక్ష్మీపార్వతిగారి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు. ఎన్టీఆర్గారి జీవితంలోకి ఆమె వచ్చినప్పటి నుంచే సినిమా తీశా. ఆమె పైన చాలా అభియోగాలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్గారిలాంటి సూపర్స్టార్కి మామూలు వాళ్లు దగ్గరవలేరు కదా? అంటే ఆమెలో ఏదో ప్రత్యేకం ఉందనేగా? ఈ చిత్రంలో నాదెండ్ల భాస్కరరావుగారి ఎపిసోడ్ ఉండదు. అందుకే కొత్తవారితో... రియలిస్టిక్ క్యారక్టర్లను పెద్దగా ఫేమస్ కానివారు చేసినప్పుడు ఆ పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయని నా నమ్మకం. అందుకే ‘వీరప్పన్, వంగవీటి’ చిత్రాలను కూడా కొత్తవాళ్లతోనే చేశా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో విజయ్కుమార్ చక్కగా ఒదిగిపోయారు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆయన రెండు నెలలు వర్క్షాప్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్గారిని మనం సినిమాల్లోనూ, పొలిటికల్ స్పీచుల్లోనే చూశాం. కానీ, ఆయన లివింగ్ రూమ్లో, బెడ్రూమ్లో వ్యవహరించిన తీరు పట్టుకోవడమంటే ఏ నటుడికైనా ఒక ట్రెమండస్ ఎమోషనల్ డెప్త్ను కేప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆయన చాలా బాగా చేశారు. యజ్ఞాశెట్టి కన్నడ నటి. ఏ పార్టీకీ సపోర్ట్ కాదు ఈ సినిమా వైఎస్సార్కాంగ్రెస్పార్టీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనడం అవాస్తవం. మనం ఏం చెప్పినా అవతలివాళ్లు ఏది నమ్మాలనుకుంటే దాన్నే నమ్ముతారు. నిర్మాత రాకేష్రెడ్డి వైసీపీ అని ముందు నాకు తెలియదు.. తెలిసినా నేను ఏమీ అనేవాడిని కాదు.. అది వేరే విషయం. 25 ఏళ్ల క్రితం జరిగిన కథ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో కానీ, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఎలా ఉంటుంది? అవి అవాస్తవాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల ఆపేస్తే రూ. 50 కోట్లు ఇస్తామని నిర్మాతకి ఆఫర్ వచ్చిందనేమాట అవాస్తవం. నేను సినిమా మేకర్ని. కష్టపడి ఓ సినిమా చేసినప్పుడు దాన్ని రిలీజ్ చేయాలనే అనుకుంటా. అంతేకానీ విడుదల చేయకూడదనుకోను. సినిమాను విడుదల చేయొద్దని డిస్ట్రిబ్యూటర్లకు బెదిరింపులు వచ్చాయనడం కూడా తప్పు. అవన్నీ యూట్యూబ్ చానళ్లలో వచ్చిన విషయాలు. ఏది అబద్ధమో? నాకు చంద్రబాబు మూలాన నష్టం జరగలేదు.. వైఎస్ జగన్ వల్ల లాభం కూడా లేదు. అటువంటప్పుడు బాబుగారికి వ్యతిరేకంగా ఈ సినిమా తీయాల్సిన అవసరం ఏముంది?. ఎన్టీఆర్గారి బయోపిక్ గురించి నేను బాలకృష్ణని కలిశాను. కానీ, ఆయన నన్ను కలవలేదంటున్నారంటే.. ఆయన చెప్పింది అబద్ధమై ఉండాలి. లేదంటే నేను చెప్పిందైనా అబద్ధం అయి ఉండాలి. దేన్ని నమ్ముతారో మీ ఇష్టం (నవ్వుతూ). చంద్రబాబుగారే విడుదల చేయిస్తారు ఇది ప్రజాస్వామ్య దేశం. ఒకరి భావ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు మరొకరికి లేదు. మా సినిమాని ఆపడం 100శాతం ఎవరి వల్లా కాదు. చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రి కనుక లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా మా సినిమాని ఏపీలో ఆయనే విడుదల చేయిస్తారు. నాకు చాలా వ్యసనాలున్నాయి వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీ నాకు వ్యసనం అయిపోయిందనే మాట ఉంది. నాకు ఉన్న చాలా వ్యసనాల్లో ఇది కూడా ఓ వ్యసనమైనా పర్వాలేదు. నా కెరీర్లో 90శాతం ఔట్ ఆఫ్ ద బాక్స్ కాంట్రవర్శీలను తీసుకునే సినిమాలు చేశా. ‘సర్కార్, రక్తచరిత్ర, వంగవీటి’... ఇలా ఏదైనా అలాంటిదే. ‘కథానాయకుడు’ చూశా బాలకృష్ణ ‘కథానాయకుడు’ సినిమా చూశా. అందులో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పడానికి నేనెవరిని? అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా సీన్లను పేర్చారనిపించింది. అది కరెక్ట్ కాదు ఆడియన్స్ ఎక్కువగా నెగటివిటీని ఇష్టపడతారనడం కరెక్ట్ కాదు. సినిమాలో ఫండమెంటల్గా ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది మెయిన్. గాంధీ సినిమా చేస్తున్నామని చెప్పి బ్రిటీష్ని అందులో నుంచి తీసేస్తే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది? సినిమా అంటే ఆయన ఎప్పుడు పుట్టారు? ఏ స్కూల్కి వెళ్లారు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అన్నది కాదు. బ్రిటీషర్ల రాకతో సినిమా ఆపేస్తే ఎలా ఉంటుంది? ఓటర్లకు అవగాహన ఉంటుంది నాయకులు ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చిన విధానంపై ఓటర్లకు ఓ అవగాహన ఉంటుంది. ఆ నమ్మకంతోనే వారికి ఇష్టమైన వ్యక్తికి ఓటు వేస్తారు. వారు బాగా నమ్మిన వ్యక్తి గురించి సడన్గా ఏదో తెలిసి నమ్మకం పోగొట్టుకున్నారనుకోండి.. ఏ మేరకు సాధ్యమవుతుంది? అది ఎంత మందిని ప్రభావితం చేస్తుందనే విషయం నాకు తెలియదు. ముందుపోటు పొడుస్తా... నేను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు. ఎప్పుడూ ముందుపోటే పొడుస్తా. నేను జ్యోతిష్కుడిని కాదు ఆంధ్రప్రదేశ్కి కొత్త ముఖ్యమంత్రి ఎవరని చెప్పడానికి నేను జ్యోతిష్కుడిని కాదు. కాకపోతే ఎవరు వచ్చినా ఫరక్ పడదు. మార్పు అనేది ప్రాసెస్లో రావాలేగానీ, ఎన్నికలతో జరుగుతుందని అనుకోను. కాకపోతే సీఎంగా ఒక చాయిస్ పవన్ కల్యాణ్, మరో చాయిస్ కేఏ పాల్. పవన్ కల్యాణ్ మంచి అందగాడు. తనొస్తే అందమైన ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు మధ్యలోని సినిమా పేజీల్లో చూసే అతని ఫొటో ముఖ్యమంత్రి అయితే రోజూ మొదటి పేజీలో చూడొచ్చు. కేఏ పాల్ ముఖ్యమంత్రి అయితే ప్రతి రోజూ కామెడీనే. రూ.200 పెట్టి కామెడీ సినిమా చూడాల్సిన అవసరం ప్రజలకు రాదు. ఆయన గతంలో నన్ను ముంబైలో కలిశారు. మనిషి పుట్టి దాదాపు 60వేల ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేఏ పాల్ అంత అబద్ధాలు చెప్పేవారిని నేనెప్పుడూ చూడలేదు. కేసీఆర్ బయోపిక్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్గారి బయోపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నా. ఇందులో వివాదాలేమీ ఉండవు. త్వరలోనే వివరాలు చెబుతా. నేను తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్లో ఒకటి సెప్టెంబరులో విడుదల అవుతుంది. చంద్రబాబుగారే ఓ సినిమా తీసుకోవచ్చు ఎన్టీఆర్గారి వైపు నుంచి చూస్తే వైశ్రాయ్ హోటల్ ఘటనలో 100శాతం కుట్ర దాగి ఉంది. నాదెండ్ల భాస్కరరావుగారు పార్టీ కోసం తప్ప ఎన్టీఆర్గారిని పెద్దగా కలిసింది లేదు. సీబీఎన్ (చంద్రబాబునాయుడు), రక్తసంబంధీకులు, దగ్గరివాళ్లు చేసిన ‘వైశ్రాయ్’ కుట్ర ఎప్పుడూ పెద్ద కుట్రే అవుతుంది. చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనదే నిజమైనప్పుడు బాబుగారే ఒక సినిమా తీసుకోవచ్చు. వార్నింగ్ ఇచ్చారు ఈ సినిమా తీస్తున్న టైమ్లో ‘ఇ లాంటి వ్యవహారాలు నీకెందుకు? సినిమా తీయకపోవడమే మంచిది’ అంటూ నాకు కొందరు సలహాలు ఇచ్చారు. కానీ, నేనెవరి సలహాలు పాటించను (నవ్వుతూ).. సినిమా పూర్తయ్యాక విడుదల ఆపాలంటూ టీవీ డిబేట్లో ఉన్నప్పుడు వార్నింగ్లు ఇచ్చారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. మనం లీగల్గా కరెక్ట్గా చేస్తున్నప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో ఏదీ కష్టం కాదు. -
నిర్ధాక్షణ్యంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చేశారు..
తమిళసినిమా: అగ్రనటి నయనతార. ఆమె చిత్రం అంటే వ్యాపారం పరంగా ఎలాంటి ఢోకా ఉండదు. ఇక ప్రేక్షకులు కూడా నయనతార చిత్రం అంటే ఎలాగున్నా మినిమం గ్యారెంటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. అలాంటిది ఆ నటి చిత్రంపై దర్శక నిర్మాతలు అసంతృప్తితో ఉండడం ఏమిటనేగా మీ సందేహం. ఆ కథేంటో చూసేద్దాం. నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కొలమావు కోకిల ఒకటి. ఆమె డ్రగ్స్ స్మగ్లర్గా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించింది. చిత్ర నాయకి డ్రగ్స్ స్మగ్లర్ పాత్రలో నటిస్తోందన్న సమాచారం బయటకు రాగానే కొలమావు కోకిల చిత్రంపై ఆసక్తి పెరిగిపోయింది. ఇక నయనతార ప్రధాన పాత్ర పోషించిన చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. చిత్రం టీజర్ ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తోంది. అందులో నయనతారను విపరీతంగా ఒన్సైడ్ చేసే హాస్యనటుడు యోగిబాబు పాత్రకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతా బాగానే ఉంది. సమస్య అంతా సెన్సార్బోర్డుతోనే. ఈ చిత్రం సెన్సార్కు వెళ్లగా పూర్తిగా చూసిన సభ్యులు నిర్ధాక్షణ్యంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీంతో చిత్ర వర్గాలకు షాక్. అయితే దర్శకుడు నెల్సన్ ఎలాగో సెన్సార్ సభ్యులతో పోరాడి యూ/ఏ సర్టిఫికెట్కు తీసుకొచ్చినట్లు సమాచారం. అదీ కొన్ని సన్నివేశాల కట్స్ తరువాతేనట. అయితే చిత్ర నిర్మాత మాత్రం ఈ విషయంలో చాలా అప్సెట్ అయ్యారని, కొలమావు కోకిలను రివైజింగ్ కమిటీకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఆర్సీకి వెళ్లితే నయనతార చిత్రానికి యూ సర్టిఫికెట్ లభిస్తుందని నిర్మాత నమ్ముతున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. -
ఒక్క కట్తో ఉడ్తా పంజాబ్కు హైకోర్టు ఓకే
ఉడ్తా పంజాబ్ సినిమా న్యాయ పోరాటానికి ఫలితం లభించింది. రెండు రోజుల్లో సినిమాకు కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్సీని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలన్న సీబీఎఫ్సీ డిమాండును హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు నిర్ణయంతో తమకు పెద్ద ఊరట కలిగిందని, సినిమాను షెడ్యూల్డు సమయానికే విడుదల చేయాలని చూస్తున్నామని చిత్ర దర్శకుడు అభిషేక్ చౌబే తెలిపారు. ఇది కేవలం తమకు మాత్రమే కాక మొత్తం సినీ పరిశ్రమకే మంచి తీర్పు అని సినిమా సహ నిర్మాత మధు మంతెన వర్మ అన్నారు. తాము కేవలం ఒక్క సీన్ మాత్రమే కట్ చేయాల్సి ఉంటుందని, ఈ తీర్పుతో ప్రజాస్వామ్యం నిలబడినట్లయిందని అనురాగ్ కశ్యప్ తరఫు న్యాయవాది అన్నారు. అంతకుముందు సీబీఎఫ్సీ సూచించిన అన్ని కట్లను హైకోర్టు పరిశీలించి ఒక్కొక్క దానిపై వ్యాఖ్యానించింది. సీబీఎఫ్సీ సూచించిన 8వ కట్ ఏమాత్రం అక్కర్లేదని, కేవలం ఒక వ్యక్తి డ్రగ్స్ ఇంజక్షన్ తీసుకుంటున్న క్లోజప్ షాట్ వల్ల నియమాలను ఉల్లంఘించినట్లు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఏడో కట్ కూడా అక్కర్లేదని, మూడో పాటలో గోకుతున్న సీన్ను తీయక్కర్లేదని స్పష్టం చేసింది. పంజాబ్ హరిత విప్లవ భూమి అని, కేవలం ఒక్క వాక్యం వల్ల (జమీన్ బంజర్ తే ఔలాద్ కంజర్) ఆ ఇమేజికి ఎలాంటి భంగం వాటిల్లదని తెలిపింది. ఇక టామీ సింగ్ జనం ఎదురుగా మూత్రవిసర్జన చేస్తున్న సీన్ అవసరం లేదన్న హైకోర్టు.. ఆ సీన్ను సినిమాలోంచి తీసేయాలని తెలిపింది. -
ఆ సినిమాకు రాజమౌళి మద్దతు
ఉడ్తా పంజాబ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో చెలరేగిన వివాదంపై దర్శకధీరుడు రాజమౌళి స్పందించాడు. దేశం ఏం చూడాలో కొద్దిమంది వ్యక్తులు నిర్ణయించలేరని అన్నాడు. ఈగ, బాహుబలి లాంటి సినిమాలతో ఒక్కసారిగా జాతి దృష్టిని ఆకర్షించిన రాజమౌళి.. ఉడ్తా పంజాబ్ చిత్ర టీమ్కు మద్దతుగా నిలిచాడు. ఆ సినిమాకు సెన్సార్ బోర్డు వాళ్లు ఏకంగా దాదాపు 90 కట్లు చెప్పడాన్ని విమర్శించాడు. తానుకూడా ఒక దర్శకుడిని కాబట్టి.. దర్శకులకే తన మద్దతు ఉంటుందని చెప్పాడు. ఆరేడుగురు లేదా పదిమంది కూర్చుని మొత్తం జాతికి ఏది మంచో ఏది చెడో ఎలా చెబుతారో ఆలోచించాలని.. ఇది చాలా సింపుల్ లాజిక్ అని రాజమౌళి అన్నాడు. తనకు, తన కుటుంబానికి ఏది మంచో కాదో తాను నిర్ణయించుకోవాలని.. అలాగే తన పిల్లలు ఏం చూడాలో చూడకూడదో నిర్ణయించుకోవచ్చని అంతే తప్ప ఊరందరి విషయం తానొక్కడినే ఎలా నిర్ణయిస్తానని అన్నాడు. 'ఇండియన్ ఆఫ్ ద ఇయర్: ఎంటర్టైన్మెంట్ 2015' అవార్డును అందుకోడానికి రాజమౌళి ఢిల్లీ వచ్చాడు.