Saltwater
-
ఉప్పునీటిలో కరిగిపోయే ప్లాస్టిక్..
సముద్ర జలాల కాలుష్యంపై పోరాటంలో భాగంగా జపాన్ కు చెందిన రికెన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మ్యాటర్ సైన్స్ (సీఈఎంఎస్ ) శాస్త్రవేత్తలు ఉప్పునీటిలో కరిగిపోయే కొత్త రకం ప్లాస్టిక్ను ఆవిష్కరించారు. సముద్ర పర్యావరణ వ్యవస్థలు, ప్రపంచ జీవవైవిధ్యానికి గణనీయమైన ముప్పును కలిగించే మైక్రోప్లాస్టిక్ కాలుష్యం సమస్యను పరిష్కరించడంలో ఈ ఆవిష్కరణ ఆశాదీపంగా కనిపిస్తోంది.రహస్యమంతా సమ్మేళనంలోనే.."సుప్రమోలిక్యులర్ ప్లాస్టిక్" అని పిలిచే ఈ వినూత్న పదార్థం సాధారణంగా ఉపయోగిస్తున్నప్పుడు మన్నికగా ఉంటుంది. అదే సముద్రపు నీటిలో కలిస్తే సురక్షితంగా అందులో విచ్ఛిన్నమవుతుంది. ఈ రహస్యమంతా దాని ఉన్న పదార్థాల సమ్మేళనంలోనే ఉంది. ఇందులో రివర్సబుల్ సాల్ట్ బ్రిడ్జ్లు ఉంటాయి. ఇవి ఉప్పునీటిలో ఉన్న ఎలక్ట్రోలైట్ల ద్వారా అస్థిరతకు గురవుతాయి. ఇది ప్లాస్టిక్ను పర్యావరణ నిరపాయమైన సమ్మేళనాలుగా విచ్ఛిన్నం చేసే రసాయన ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది. దీని అర్థం ఎటువంటి హానికరమైన మైక్రోప్లాస్టిక్ అనేది మిగలకుండా ఈ పదార్థం కరిగిపోవడమే కాకుండా సముద్ర జీవులతో ఆ చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థపైనా ఎలాంటి ప్రభావాన్ని చూపించదు.సాంప్రదాయ ప్లాస్టిక్లకు స్థిరమైన ప్రత్యామ్నాయంసాంప్రదాయ ప్లాస్టిక్ క్షీణించడానికి కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కూడా పట్టవచ్చని మనకు తెలుసు. ప్లాస్టిక్ అవశేషాలు మహాసముద్రాలలో పేరుకుపోతాయి. విస్తారమైన చెత్త పాచెస్ను ఏర్పరుస్తాయి. వాటి క్రమంగా విచ్ఛిన్నం నుండి ఉత్పన్నమయ్యే మైక్రోప్లాస్టిక్స్ ఆహార గొలుసులోకి చొరబడతాయి. ఇది జలచరాలు, మానవుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ కరిగే ప్లాస్టిక్ అభివృద్ధి ఒక స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ప్లాస్టిక్ ఉత్పత్తులపై అధికంగా ఆధారపడే పరిశ్రమలలో విప్లవాత్మకమైన మార్పును కలిగిస్తుంది.ఇటువంటి ఆవిష్కరణ అనువర్తనాలు ప్యాకేజింగ్ మెటీరియల్స్, సింగిల్-యూజ్ వస్తువుల నుండి ఫిషింగ్ వలలు, ఇతర సముద్ర పరికరాల వరకు ఉంటాయి. సంప్రదాయ ప్లాస్టిక్ లను పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంతో భర్తీ చేయడం ద్వారా, పరిశ్రమలు ప్రపంచ స్థాయిలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఈ సరికొత్త ప్లాస్టిక్ అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ప్లాస్టిక్ వినియోగం, విచ్ఛిన్న ప్రక్రియలను పూర్తీగా మార్చేస్తుందని భావిస్తున్నారు. -
ప్రమాదంలో కొల్లేరు సరస్సు..
సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): కొల్లేరు సరస్సు ఉప్పు నీటి సరస్సుగా మారిపోతుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొల్లేరుకు ఉన్న 67 మేజర్, మైనర్ డ్రెయిన్ల నుంచి నీరు రాకపోవడంతో ఎండిపోతుందన్నారు. కొల్లేరు లోతు పెంచి నీటి సామర్థ్యం పెంచాల్సిన అవసరం ముందన్నారు. సముద్రం నుండి ఉప్పు టేరుకు, ఉప్పుటేరు నుండి కొల్లేరుకు ఉప్పు నీరు రాకుండా రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. తీర ప్రాంతంలో సారవంతమైన భూములు ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లేరును పరిరక్షించి పక్షి జాతులను కాపాడాలని, కొల్లేరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. గత నెల 28న కొల్లేరు పరిరక్షణకు కలెక్టర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం జరిగిందని తెలిపారు. -
ఎవరు నేర్పారో!
మనుషులు, పక్షులే కాదు.. జలచరాలు కూడా వలసవాదులే. చేపలు ఉప్పునీటి నుంచి మంచి నీటిలోకి, మంచి నీటి నుంచి ఉప్పు నీటిలోకి వలస వెళ్తుంటాయి. ఈ వలసలను సదరు జలపుష్పాలు హనీమూన్గా భావిస్తాయేమో కానీ.. ఈ కాలాన్నే అవి తమ ప్రత్యుత్పత్తికి అను వుగా భావిస్తాయి. గుడ్లు పెట్టి పొదుగుతాయి. గుడ్లు పొదిగిన తర్వాత పుట్టుకొచ్చే చేపపిల్లలు మాత్రం తిరిగి వాటి సొంత నెలవుకు వెళ్లిపోతాయి. ఉప్పునీటిలో పుట్టినవి మంచి నీటిలోకి.. మంచినీటిలో పుట్టినవి ఉప్పునీటిలోకి క్యూ కడతాయి. అప్పుడే పుట్టిన ఈ మీనాలకు ఆ దారి ఎలా తెలుస్తుందన్నది మాత్రం దేవ రహస్యమే! ఈ మర్మాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నా.. వీటికి ఈ విషయం ఎవరు నేర్పారో మాత్రం కనుక్కోలేకపోతున్నారు. -
ముప్పు నీరు!
=తీర గ్రామాలకు ఉప్పునీటి ప్రమాదం =భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం =తగ్గిపోతున్న మంచినీటి పరిమాణం =సముద్ర జలాల ఉధృతితో దుష్పరిణామం తీరంలో ఉండడమే ఆ గ్రామాల ప్రజలు చేసుకున్న నేరం.. సాగరానికి చేరువలో బతకాల్సి రావడమే వారు చేసిన పాపం... మంచినీటి వనరులు ఉప్పునీటి కాసారాలవుతూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఉండడమే వారి బతుకుల్లో తప్పని విషాదం. జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో మంచినీటి వనరులను ఉప్పునీటి ఉప్పెన ముంచెత్తుతూ ఉన్నా ఏమీ చేయలేని దుస్థితి వారి సొంతం. భూగర్భ జలాలలను క్రమేపీ ఉప్పునీరు కబళిస్తూ ఉంటే నిట్టూరుస్తూ బతకడం వారి ఖర్మం. సాక్షి, విశాఖపట్నం : తీర ప్రాంత గ్రామాలను కనిపించని ఉపద్రవం చాపకింద నీరులా ముంచెత్తుతోంది. జిల్లాలోని తీర ప్రాంత గ్రా మాలకే కాదు వాటి సమీప గ్రామాలకు కూడా తాగునీటి ముప్పు పొంచి ఉంది. సముద్ర జలాలు చొచ్చుకొస్తూ ఉండడంతో భూగర్భంలోని స్వచ్ఛమైన నీరు ఉప్పునీటితో కలుషితమవుతోంది. దీంతో ఉప్పు నీటి ప్రభావం రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇప్పటికే తాగడానికి అనుకూలంగా లేవని సుమారు 120 గ్రామాలకు వివిధ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్న అధికారులకు ఇదో సవాలు కానుంది. భవిష్యత్తులో మరికొన్ని గ్రామాలు ఉప్పునీటి ఉచ్చులో చిక్కుకోనున్నాయి. భూగర్బ జల శాఖ చేస్తున్న అధ్యయనం ద్వారా ఈ వివరాలు తెలియవస్తున్నాయి. ప్రమాద ఘంటికలు : జిల్లాలో 120 కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం ఉంది. ఇందులో 62 మత్స్యకార గ్రామాలు,మరో 100 వరకు ఇతర పల్లెలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ఉప్పు నీటి ప్రభావం ఉంది. దీంతో అత్యధిక గ్రామాలకు వివిధ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ఉప్పునీటి ప్రభావిత గ్రామాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. తీర ప్రాంతం ఆనుకుని ఉన్న గ్రామాల్లో నీటి వినియోగం మోతాదుకు మించి రోజురోజుకూ ఎక్కువవుతూ ఉండడంతో భూగర్బ జలాల్లోని మంచినీటి స్థాయి పడిపోతోంది. దీంతో సముద్ర జలాల ఒత్తిడి పెరుగుతోంది. భూగర్బ జలాల్లోకి సముద్ర జలాలు చొచ్చుకొచ్చేస్తున్నాయి. మరోవైపు పరిశ్రమల వ్యర్థ జలాలు కూడా రకరకాల మార్గాల్లో భూగర్భ జలాల్లోకి కలిసిపోతున్నాయి. దీంతో లవణాల శాతం గణనీయంగా పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విస్తృత అధ్యయనం : మారుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భూగర్బ జల శాఖ ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది. రుషికొండ నుంచి తిమ్మాపురం మీదుగా పోర్టు వరకు ఒక యూనిట్గా చేసుకుని అధ్యయానికి శ్రీకారం చుట్టింది. అనుమానించినట్టుగా అధ్యయనంలో ప్రమాదకర సంకేతాలొస్తున్నాయి. దీని తర్వాత జిల్లాలోని మిగతా ప్రాంతాల్ని దశల వారీగా అధ్యయనం చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తీర ప్రాంతాల గ్రామాల భూగర్బ జలాలను శాంపిల్గా తీసుకుని పరిశీలిస్తున్నారు. సమస్యను అదుపులో ఉంచాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భూగర్బ జల శాఖ నిపుణులు చెబుతున్నారు. నీటి దుర్వినియోగాన్ని తగ్గించుకోవాలని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, వర్షపు నీటిని కందకం ద్వారా కాపాడుకోవాలని, బోరుబావులను రీఛార్జ్ చేసుకోవాలని, నదుల్లో ఇసుకను కాపాడుకోవాలని, విచ్చలవిడిగా బోర్లు తవ్వకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.