breaking news
Salmanraju
-
కరుణామయుని కోవెలలో..
సాక్షి, మెదక్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చికి భారీ ఎత్తున భక్త జనం తరలివచ్చారు. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే రహదారులు బుధవారం వాహనాలు, భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే భక్తు ల రాక ప్రారంభమైంది. ఉదయం 4.30 గంటలకు జరిగిన మొదటి ఆరాధనలో సీఎస్ఐ చర్చి బిషప్ సాల్మన్రాజ్ దైవసందేశం ఇచ్చారు. చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులతోపాటు హిందువులు, ముస్లింలు కూడా రాగా.. మతసామరస్యం వెల్లివిరిసింది. కాగా, క్రిస్మస్ సందర్భంగా చర్చి ప్రాంగణం జాతరను తలపించింది. పోలీసులు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అధికారులతోసహా మొత్తం 450 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. అయితే.. పట్టణంలో కేటాయించిన మూడు పార్కింగ్ స్థలాలు కిక్కిరిసి పోగా.. రహదారుల వెంటే వాహనాలను పార్కింగ్ చేయడంతో పలుచోట్ల ట్రాఫిక్ సమస్య నెలకొంది. దేవుడి ఆశీస్సులతో అభివృద్ధి: హరీశ్రావు ఏసయ్య జీవితాంతం ప్రజల కోసమే బతికారని మం త్రి హరీశ్రావు అన్నారు. దయ, కరుణ, ప్రేమ గుణాల ను ప్రతీ మనిషి కలిగి ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ దేవుడి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అంతకు ముందు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి క్రిస్మస్ కేక్ను కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చి ముందు భక్తుల రద్దీ -
కుంటిసాకులు చెప్పొద్దు
మీకోసంలో ఇన్చార్జి కలెక్టర్ ఆగ్రహం మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లా అధికారులు అబద్దాలు చెప్పకుండా మీ కోసం కార్యక్రమంలో ఇచ్చిన అర్జీల పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఇన్చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు జేసీ-2 ఒంగోలు శేషయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ సమావేశాలకు రావాల్సిన అధికారులు కుంటిసాకులు చెప్పకుండా మీకోసం కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. సొంత పనులపై వెళుతూ కిందిస్థాయి సిబ్బందిని పంపి.. ప్రభుత్వ సమావేశాల్లో ఉన్నామని చెప్పించడం సబబు కాదన్నారు. సమావేశాలు లేకపోయినా సమావేశంలో ఉన్నామని చెబుతూ ఏ వివరాలు తెలియని సిబ్బందిని పంపి అర్జీలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. మత్స్యశాఖ డీడీ సాల్మన్రాజు సమావేశానికి హాజరుకాకుండా సూపరింటెండెంట్ను పంపడం, సమస్యలపై అర్జీదారులు ఇచ్చే వినతులకు ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఇన్చార్జి కలెక్టర్ గెటవుట్ అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి సమావేశానికి హాజరైన మత్స్యశాఖ డీడీ కూడా పొంతన లేని సమాధానాలు చెప్పటం ఇన్చార్జి కలెక్టర్కు విస్మయం కలిగించింది. జిల్లా అధికారులు మీ కోసంలో వచ్చిన అర్జీలు పరిశీలించడాన్ని సీరియస్గా తీసుకోవాలని, పరిష్కారశాతం పెరగాలని సూచిం చా రు. స్మార్ట్విలేజ్ కార్యక్రమంలో భాగంగా కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో ప్రత్యేకాధికారి పర్యటించినప్పుడు అంగన్వాడీ కేంద్రం మూసివేసి ఉండడం, పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఆయన నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా ఇన్చార్జి కలెక్టర్ ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారిని ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.ు సీడీపీవోకు పంపి విచారణ చేయమని ఆదేశాలిచ్చానని తెలిపారు. జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, డీఎస్వో వి.రవికిరణ్, డీఆర్డీఏ పీడీ వి. చంద్రశేఖరరాజు, డ్వామా పీడీ మాధవీలత, డీఈవో ఎ.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.