breaking news
saftware engineer
-
డీసీఎం, కారు ఢీ.. ఒకరి మృతి
మహేశ్వరం: ముందు వెళ్తున్న డీసీఎం వాహానాన్ని కారు ఢీకొట్టిన ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇం జినీర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని తుక్కుగూడ ఔ టర్ రింగ్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం చో టు చేసుకుంది. పహాడీషరీఫ్ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్నగర్ ప్రా ంతానికి చెందిన కిరణ్(35) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. మైసిగండిలో ఓ ఫంక్షన్కు హజరయ్యేందుకు తన సాంత్రో కారులో భార్య, బంధువులతో కలిసి వెళ్తున్నాడు. మార్గమధ్యలో తుక్కుగూడ ఔటర్పై ముందుగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య అనురాధ, బంధువు జంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ఔటర్ సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తర లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బయటకి తీస్తున్న దృశ్యం -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఘరానా మోసం
వరంగల్: పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న రాజ్కుమార్ పెళ్లైన విషయం దాచి, మరోయువతితో పెళ్లికి రెడీ అయ్యాడు. అయితే రాజ్ కుమార్ పెళ్లైన విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు చాకచక్యంతో వ్యవహరించడంతో గుట్టురట్టయింది. రాజ్ కుమార్, తల్లిదండ్రులను హన్మకొండ పోలీసులకు అప్పగించారు. రాజ్ కుమార్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.