-
వరల్డ్ లో ఒక్కే ఒక్క రొమాంటిక్ హీరో చిరంజీవి గారు: దేవిశ్రీ ప్రసాద్
-
నాయికల నాయకుడు
మననం అక్కినేని తొలి దశలో నటించిన చిత్రాలతో ‘రొమాంటిక్ హీరో’ ఇమేజ్ ఏర్పడింది. ప్రేమ, విరహం, విషాదం... అంటే ఆయన ఓ ‘రోల్ మోడల్’ అయ్యారు. తన సినీ జీవితంలో అక్కినేని సరసన 76 మంది కథానాయికలు నటించడం ఓ రికార్డు! తొలి రోజుల్లో శాంతకుమారి, లక్ష్మీ రాజ్యం, ఎస్.వరలక్ష్మి, భానుమతి, అంజలీదేవి, సావిత్రి; ఆ తర్వాత షావుకారు జానకి, జమున, కృష్ణకుమారి, బి.సరోజాదేవి, రాజసులోచన, కాంచన, పద్మిని వంటివారు అక్కినేని సరసన నటించారు. ‘మాయలోకం’లో ఆయన కంటే వయసులో పెద్దవారైన శాంతకుమారి, ఎమ్.వి.రాజమ్మల సరసన హీరోగా నటించారు ఏఎన్నార్. శాంతకుమారితో ప్రేమ సన్నివేశాలలో నటిస్తున్నప్పుడు కంగారుపడేవారట. అప్పుడు శాంతకుమారి అలాంటి సన్నివేశాలలో ప్రేమను పండించాలంటే... డైలాగులు ఎలా చెప్పాలో, శృంగారాన్ని ఎలా అభినయించాలో చెప్పి ఉన్న భయాన్ని పోగొట్టారు. భరణీ వారి తొలి చిత్రం ‘రత్నమాల’లో భానుమతి సరసన మొదటిసారిగా నటించారు అక్కినేని. ఆ చిత్రానికి దర్శకుడు భానుమతి భర్త రామకృష్ణ. భానుమతితో అక్కినేనికి చనువు ఏర్పడాలని - వాళ్లిద్దర్నీ కలిసి పరుగెత్తమని చెప్పి 16 మి.మీ. కెమెరాతో ఆ దృశ్యాలను తీసి చూపించేవారు. భానుమతిని ‘మేడమ్’ అని, రామకృష్ణను ‘గురువుగారూ’ అని పిలిచేవారు అక్కినేని. ‘చింతామణి’ తీయాలని సంకల్పించి, బిల్వమంగళుడి పాత్రను ధరించమని వాళ్లు కోరినప్పుడు అక్కినేని తిరస్కరించారు. ‘‘నేను చేయకపోవడం అలా ఉంచండి. చింతామణి మేడమ్గారు వేయదగ్గ పాత్ర కాదు. ఆ సినిమాను ‘డ్రాప్’ చేసుకోండి’’ అని కూడా సూచించారు సంస్థ పట్ల అభమానం కొద్దీ! ఆ తర్వాత భరణీ అధినేతలు ఎన్టీయార్తో ‘చింతామణి’ తీశారు. ఆ చిత్రం అపజయాన్ని చవిచూసింది. అక్కినేని హీరోయిన్లలో ప్రధానమైన నటీమణి అంజలీదేవి. ఒక బిడ్డ తల్లిగా చిత్రరంగ ప్రవేశం చేసి, ‘గొల్లభామ (1947)’ తో గ్లామర్ నటిగా సంచలనాన్ని సృష్టించారు. అంతవరకూ ‘వ్యాంప్’ పాత్రలు ధరించి, ‘శ్రీలక్ష్మమ్మ కథ’లో అక్కినేని సరసన సాధ్వి పాత్రలో మెప్పించారు. ఈ జంట ఆ రోజుల్లోనే ‘పరదేశి’లో వయసు మళ్లిన దంపతుల పాత్రల్లో కనిపించడం విశేషం. ‘ఇలవేలుపు’ చిత్రంలో మొదట ప్రేమికులై, ఆ తర్వాత నాయిక (అంజలీదేవి)ను, హీరో తల్లిగా చూడవలసి రావడం అప్పట్లో ‘యాంటీ సెంటిమెంట్’ అన్నారు. కానీ అక్కినేని, అంజలీదేవి ఆ చిత్రంలో అద్భుతంగా రాణించారు. అక్కినేని నట జీవితంలో మరో ప్రధానమైన నటీమణి సావిత్రి. ‘మూగమనసులు’లోని ‘ఈనాటి ఈ బంధమేనాటిదో’ పాటను గోదావరి నదిపై పడవలో చిత్రీకరిస్తున్నప్పుడు, సావిత్రి పట్టుతప్పి నదిలో పడిపోయారు. పడవను పట్టుకుని వేలాడుతున్న ఆమెను సమయస్ఫూర్తితో అక్కినేని చేయి పట్టుకుని పైకి లాగుతూ ఉంటే, ఈతగాళ్లు వచ్చి ఆ ఇద్దరినీ కాపాడటం జరిగింది. సావిత్రి ఎంతోమందికి చెప్పారు ఏయన్నార్ రక్షించిన సంగతి! ‘సావిత్రి మనిషిగా గొప్పదా? నటిగా గొప్పదా? అనేది తేల్చుకోవడం కష్టం’ అంటారు అక్కినేని. ఆ తర్వాత వచ్చిన మరోతరం నటీమణులలో లక్ష్మి, శారద, జయలలిత, వాణిశ్రీ, భారతి - అనంతరం లత, జయచిత్ర, సుజాత, మంజుల, జయసుధ, జయప్రద వంటివారు అక్కినేని సరసన ఆకర్షణీయమైన పాత్రలు పోషించారు. ప్రేక్షకులకు ‘రాంగ్ మెసేజ్’ వెళ్లకూడదనేది అక్కినేని వాదం. యద్దనపూడి సులోచనారాణి నవల ‘విజేత’ ఆధారంగా ‘విచిత్ర బంధం’ తీస్తున్నప్పుడు, హీరో కథానాయిక (వాణిశ్రీ)ను ‘రేప్’ చేసే ఘట్టాన్ని ఎంతగానో వ్యతిరేకించారు. నిర్మాత దుక్కిపాటి, దర్శకుడు ఆదుర్తి - ఆయనను అతికష్టం మీద ఒప్పించారు. చిత్రీకరణ అయిన తర్వాత ‘‘ఓస్! రేప్ అంటే ఇదేనా? ఏమో అనుకుని భయపడ్డాను’’ అని వాణిశ్రీ నవ్వారు. ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా చిత్రీకరించారు ఆదుర్తి. ప్రేమ సన్నివేశాలైనా, ఏ తరహా దృశ్యాలైనా ఆలోచింపజేసేలా, ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండాలనేది అక్కినేని ధోరణి. అందుకనే ఏదీ ‘మోతాదు’కు మించకుండా ఉండాలని కోరుకుంటూ, ఆ మేరకు దర్శక నిర్మాతలు శ్రద్ధ వహించేలా చూసేవారు. ఆ మధ్య అక్కినేని నాయికలందరూ ఒకే వేదికపై చేరి, ఆయనను సత్కరించడం విశేషానందాన్ని కలిగించిన ఘట్టం! - బి.కె.ఈశ్వర్ -
టీవీక్షణం: బుల్లితెర మన్మథుడు
మన్మథుడు అనగానే నాగార్జున గుర్తొస్తాడు. అంతవరకూ రొమాంటిక్ హీరోగా మనసులు దోచిన నాగ్, ‘మన్మథుడు’ సినిమాలో అమ్మాయిలంటే పడనివాడిగా కనిపించాడు. ఇప్పుడు బుల్లితెర మీద కూడా ఓ మన్మథుడు తయారయ్యాడు. అతడే... రవికృష్ణ! ‘మొగలిరేకులు’ ఫాలో అయిన వాళ్లందరికీ ‘దుర్గ’గా పరిచితుడు రవికృష్ణ. సౌమ్యుడిగా, మంచి ప్రేమికుడిగా నటించాడందులో. ఇలాంటి బాయ్ఫ్రెండ్ తమకూ ఉంటే బాగుణ్నని అమ్మాయిలు ఫీలయ్యేంతగా అలరించాడు. కానీ జీ తెలుగులో ప్రసారమయ్యే ‘వరూధినీ పరిణయం’ సీరియల్తో తన ఇమేజ్ని మార్చి పారేశాడు. ఇందులో అతడు ప్రేమికుడు కాదు. అమ్మాయిల పొడే గిట్టనివాడు. ఆడపిల్ల నీడను కూడా అసహ్యించుకుంటాడు. అలాంటి పాత్రలో రవిని చూసి మొదట లేడీ ఫ్యాన్సంతా షాకయ్యారు. కానీ రొటీన్కి భిన్నంగా అతడు ప్రదర్శిస్తోన్న నటన చూసి ఫిదా అయిపోయారు. చిన్నప్పట్నుంచీ అమ్మాయిల కారణంగా సమస్యల్లో చిక్కుకుంటాడు హీరో. దాంతో అమ్మాయి అంటేనే సమస్య అని ఫిక్సయిపోతాడు. తల్లిని తప్ప అక్కని, చెల్లెలిని కూడా నమ్మనంతగా ద్వేషం పెంచుకుంటాడు. అలాంటివాడి జీవితంలోకి వరూధిని ప్రవేశిస్తుంది. మరి ఈ మన్మథుడి మనసులో ఆమె చోటు ఎలా సంపాదిస్తుంది, అతడితో తాళి ఎలా కట్టించుకుంటుంది అన్నదే సస్పెన్స్. అది తెలుసుకోవాలంటే... వేచి చూడాల్సిందే! నాలుగు స్తంభాలాట సీరియల్ని జీడిపాకంతో ఎందుకు పోలుస్తారో కలర్స్ చానెల్లో వచ్చే ‘ఉతరన్’ చూస్తే అర్థమవుతుంది. దాదాపు నాలుగున్నరేళ్లుగా ఈ ధారావాహిక సా...గు...తూ...నే ఉంది. ఇప్పటి కింకా ముగింపు దరిదాపుల్లోకి కూడా రాలేదు. చిన్న పిల్లలుగా ఉన్న ఇద్దరు స్నేహితురాళ్ల కథతో 2008లో మొదలైంది ‘ఉతరన్’. వాళ్లు పెద్దైపోయి పెళ్లిళ్లు చేసుకున్నారు. వాళ్ల మధ్య అపార్థాలు తలెత్తాయి. గొడవలు పెరిగాయి. ద్వేషాలు రగిలాయి. వేదనలు మిగిలాయి. ఆ రెండు జంటల మధ్య జరిగిన నాలుగు స్తంభాలాట కొన్నేళ్లకు ముగిసింది. ఆ తర్వాత వాళ్ల పిల్లలు వయసుకొచ్చి కొత్త కథ మొదలెట్టారు. వాళ్ల కూతుళ్లు మీఠీ, ముక్తలు ప్రధాన పాత్రధారులయ్యారు. వీళ్లిద్దరికీ ఇద్దరు హీరోలు జతయ్యారు. మళ్లీ నాలుగు స్తంభాలాట మొదలు! ఆకాశ్ (మృణాల్జైన్)ని పెళ్లాడి మోసపోయిన మీఠీ (టీనా దత్తా), పుట్టింటికి చేరుకుంటుంది. అప్పటికే ఆమెను ప్రేమించడం మొదలుపెట్టిన ఆకాశ్ ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. అతణ్ని వదిలించుకోవడం కోసం విష్ణు (అజయ్ చౌదరి)తో పెళ్లికి రెడీ అవుతుంది. కానీ అప్పటికే విష్ణు, ముక్త (శ్రీజిత డే) ప్రేమలో ఉంటారు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి ప్రస్తుతం తంటాలు పడుతున్నారు. చూద్దాం... ఈ నాలుగు స్తంభాలాట ఇంకా ఎన్నాళ్లు సా...గు...తుం...దో!
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement