-
రోడ్లతోపాటు మనసులను ప్రక్షాళన చేయండి
సంగడిగుంట (గుంటూరు): దేశాన్ని ప్రతి ఏడాదీ ఊడుస్తున్నారంటే మురికి పూర్తిగా తొలగించనట్లేనని దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు అన్నారు. రోడ్లతోపాటు మనుషుల మనస్సులను ప్రక్షాళన చేయాలని ఆయన సూచించారు. శనివారం స్థానిక ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బౌద్ధ సూత్రాలతోనే రాజ్యాంగాన్ని రచించారన్నారు. 6000 కులాలు అనేక మతాల, భాషల ప్రజలు సహజీవనం సాగిస్తూ దేశ జనాభా 125 కోట్లకు పెరిగింది అంబేద్కర్ రచించిన రాజ్యాంగంవల్లేనని చెప్పారు. ప్రపంచ గుర్తింపు పొందిన భారతీయులు బుద్ధుడు, అశోకుడు, అంబేద్కర్ మాత్రమేనన్నారు. మన దేశంలో ఏర్పాటు చేయనున్న 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం 200 దేశాల నుండి వచ్చే పర్యాటకులకు ఆకర్షణీయంగా మారుతుందన్నారు. అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటోల సమ మేధావి అంబేద్కర్ అని, నోబెల శాంతి బహుమతి పొందాల్సిన మహోన్నతుడని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాకు భగవద్గీతకు బదులుగా భారత రాజ్యాంగాన్ని బహూకరించాల్సిందని చెప్పారు. హిందుత్వ శక్తులను ఐక్య పరచేందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటు చేస్తున్నారన్నారు. అయితే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఐక్యపరచే సందేశాన్ని ఇస్తున్నామన్నారు. 11న బ్లూ మార్చ్: 150 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కార్యాచరణ ప్రణాళికను కత్తి పద్మారావు విడుదల చేశారు. పోస్టర్ను ఆవిష్కరించారు. ఈనెల 11న గుంటూరు నీలం రంగు మయం కానుందని చెప్పారు. ఆ రోజు మార్చ్లో పాల్గొనే వారందరికీ భోజనం, నీలం రంగు బన్నీలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సామాజిక ఉద్యమ కాారులు, కులరహిత మేధావులు, సామాజిక స్పృహ ఉన్నవారందరూ మార్చ్లో పాల్గొనాలని కోరారు. మార్చ్ స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోని మహాత్మా పూలే ప్రాంగణం వరకు జరుగుతుందని, అనంతరం అక్కడ సభతో కార్యక్రమం ముగుస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
రహదారులను దిగ్బంధించండి
కడప కార్పొరేషన్, న్యూస్లైన్ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6,7 తేదీల్లో చేపట్టనున్న రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి జిల్లా ప్రజలు సహకరించాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్బాబు విజ్ఞప్తి చేశారు. స్థానిక వైఎస్ గెస్ట్హౌస్లో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రాజంపేట, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాధ్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7వ తేదీలోపు విభజనపై ఏర్పాటుచేసిన మంత్రుల బృందం సమావేశం అవుతున్న దృష్ట్యా రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లోని అన్ని రహ దారులను దిగ్బంధించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులకు పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్రెడ్డి,కడప సమన్వయకర్త అంజ ద్బాషా, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మాసీమబాబు, అఫ్జల్ఖాన్, ఎంపీ సురేష్, పులి సునీల్, ఖాద్రి పాల్గొన్నారు. ఇంటికొకరు ఉద్యమంలో పాల్గొనాలి: ఎమ్మెల్యే ఆకేపాటి మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతి ఇంటికి ఒకరు చొప్పున సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే అమరనాధ్రెడ్డి అన్నా రు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ఆర్సీపీ మాత్రమే పోరాటం చేస్తోందని చెప్పారు. పనులు వాయిదా వేసుకోవాలి: కొరముట్ల రాష్ట్ర విభజన పై చర్చించడానికి మంత్రుల బృందం మళ్లీ సమావేశం అవుతుండడాన్ని నిరసిస్తూ రహదారుల దిగ్బంధం నిర్వహిస్తున్నామని, ప్రజలు 6, 7 తేదీలలో ఏవైనా కార్యక్రమాలుంటే వాయిదా వేసుకోవాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement