breaking news
Rekha Pandey
-
Nikita Porwal: టీవీ యాంకర్ టు మిస్ ఇండియా
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికిత పొర్వాల్ మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. టీవీ యాంకర్గా, నటిగా కెరీర్ మొదలుపెట్టి ఒక సామాన్య కుటుంబం నుంచి ఆమె ఈ గుర్తింపు పొందింది. ‘మన జీవితానికి ఒక విలువ ఉండాలి. మనం లేకపోతే నష్టాన్ని అనుభూతి చెందాలి’ అంటుంది నికిత పొర్వాల్. అక్టోబర్ 16 (బుధవారం) ముంబైలో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2024’ ఫైనల్స్లో నికిత పొర్వాల్ కిరీటధారిగా నిలిచింది. 27 రాష్ట్రాల నుంచి మొత్తం 30 మంది పోటీ పడితే నికిత మొదటి స్థానంలో నిలిచింది. దాద్రా నాగర్ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడో స్థానంలో నిలిచింది. సంగీతా బిజిలానీ, నేహా ధూపియా తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మరో నెల రోజులలో జరగనున్న ‘మిస్ వరల్డ్ 2024’ పోటీల్లో మన దేశం తరఫున నికిత ప్రపంచ దేశాల సుందరీమణులతో పోటీ పడనుంది. మిస్ వరల్డ్ కిరీటం కూడా దక్కించుకోవాలని ఆశిస్తోంది.తండ్రి ్రపోత్సాహంతో ...మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన నికిత హైస్కూల్ రోజుల నుంచే మోడలింగ్లోకి రావాలని భావించింది. ఆమె తండ్రి అశోక్ పొర్వాల్ ఇందుకు ప్రోత్సహించాడు. కూతురి ప్రతిభ గమనించి మోడలింగ్ రంగంలోకి చిన్న వయసులోనే ప్రవేశ పెట్టాడు. తల్లి రాజ్కుమారి కూడా వెన్నంటే ఉంటే నికితను నడిపించింది. ‘మోడల్గా పని చేసి మరుసటి రోజు స్కూల్కి వెళితే ఆ ప్రపంచం ఈ ప్రపంచం చాలా వేరేగా ఉండేవి. అడ్జస్ట్ కావడం కష్టమయ్యేది. కాని మా స్కూల్ వాళ్లు నాకు సపోర్ట్ నిలిచారు. కాలేజీలో చదువుకుంటూ ఫ్యాషన్ ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. రాత్రుళ్లు మేలుకొని సిలబస్ చదవడం, రికార్డులు పూర్తి చేయడంలో నిమగ్న మయ్యేదాన్ని. ఆ హార్డ్వర్క్ వృథా పోలేదు’ అంటుంది నికిత.లోపలి సౌందర్యం‘అందాల పోటీలో రాణించాలంటే లోపలి సౌందర్యాన్ని బయటకు తేవాలి. ఆ సౌందర్యానికి రూపమే మన దేహం. ముందుగా ఆ సౌందర్యాన్ని నమ్మాలి. అందుకు ధ్యానం చేయడం లాంటి ఎన్నో విధానాలు అవలంబించాను. నా మాటను, నడకను రోజుల తరబడి సాధన చేశాను. ఎదుటివారు మనలో చూసేది నిజాయితీని... మనం మనలా ఉన్నామా లేదా అనే విషయాన్ని. దాన్ని పోగొట్టుకోకూడదు’ అంటుంది నికిత. నాటకాల మీద మక్కువతో థియేటర్లో పని చేసిందామె. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రాసింది కూడా!టీవీ యాంకర్గా...కుటుంబానికి మద్దతుగా నిలవడం కోసం టీవ యాంకర్గా కూడా పనిచేసింది నికిత. అలాగే సీరియల్స్లో, సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించింది. తుదకు ‘మిస్ ఇండియా’ అయ్యింది. ‘ఈ గుర్తింపును ఎలా ఉపయోగిస్తారు’ అనంటే ‘యువతను మోటివేట్ చేయడానికి ఉపయోగిస్తాను. మన దేశంలోని యువతకు చాలా స్కిల్స్ ఉన్నాయి. కాని కమ్యూనికేషన్లో వెనుకబడుతున్నారు. మీ మాటే మిమ్మల్ని ముందుకు తీసుకెళుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ధ్యాస పెట్టండి అని చెబుతాను’ అంటోంది నికిత. మిస్ ఇండియా అయ్యాక సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకుల నుంచి పిలుపు వింటోందామె. త్వరలో వెండి తెర మీద చూడొచ్చు. -
నగరంలో నారీభేరి
మన మహిళల ఆత్మగౌరవ బావుటాను ఎగరేసింది.. ఉమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ! ఈ నెల 22వ తేదీ వరకు సాగే ఈ సమావేశం ఆదివారం హైదరాబాద్లో మొదలైంది. ఈ వేదిక నుంచి దేశవిదేశాలకు చెందిన ఎందరో నారీమణులు తమ గెలుపువాణిని వినిపిస్తున్నారు. విశ్వవనితలకు స్ఫూర్తినిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్లో హిస్టరీ డిపార్ట్మెంట్ హెడ్.. ప్రొఫెసర్, విమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ చైర్పర్సన్ అండ్ డెరైక్టర్ రేఖాపాండే ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవం వెనుక విశేషాలను ‘సిటీ ప్లస్’తో రేఖాపాండే పంచుకున్నారు. - సరస్వతి రమ ఇంటర్నేషనల్ ఇంటర్ డిసిప్లినరీ కాంగ్రెస్ ఆఫ్ విమెన్.. అనే ఆర్గనైజేషన్ మూడేళ్లకోసారి ఒక్కో దేశంలో సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 1981లో జరిగిన ఈ సంస్థ తొలి సవూవేశానికి ఇజ్రాయిల్ వేదికైంది. అమెరికా, కోస్టారికా, కెనెడా, ఉగాండా.. ఇలా ఎన్నో ప్రపంచ దేశాలు తిరిగిన ఈ సవూవేశాలు.. ఈ ఏడాది వున హైదరాబాద్లో జరుగుతున్నారుు. గతంలో పలు దేశాల్లో జరిగిన కాన్ఫరెన్స్లకు ఏ వూత్రం తీసిపోకుండా సవూవేశాలు నిర్వహిస్తున్నారు. అన్నీ అధిగమించి.. విమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువుతి వున దేశానికి తెచ్చింది రేఖాపాండేనే. కార్యక్రవుం ఇండియూలో నిర్వహించడానికి 2011లోనే ఆమోదవుుద్రపడింది. అరుుతే ఆ ఏర్పాట్లలో వూత్రం అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యూరుు. మొదట ఈ సవూవేశానికి వుూడున్నరవేల వుంది అతిథులను ఆహ్వానించాలనుకుని హైదరాబాద్లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్ను ఖాయం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయు ఘటన ఎఫెక్ట్ విదేశీ వనితలను చాలా వుంది కాన్ఫరెన్స్కు దూరం చేసింది. లేటెస్ట్గా ఎబోలా కారణంగా ఆఫ్రికా దేశాలకు చెందినవారి వీసాలన్నీ రద్దయ్యూరుు. అన్ని అడ్డంకులు దాటుకుని వేదికెక్కిన ఈ కాన్ఫరెన్స్కు వెరుు్య వుంది అతిథులు హాజరుకానున్నారు. వీళ్లలో 58 దేశాల నుంచి 200 వుంది డెలిగేట్స్ రానున్నారు. వావ్.. హైదరాబాద్ ‘మా ఈ విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్ థీమ్.. జెండర్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్! అసలు ఈ కాన్ఫరెన్స్ను మన దేశంలో పెట్టాలని జెండర్ ఆన్ హిస్టరీ, జెండర్ ఆన్ వయొలెన్స్, జెండర్ ఆన్ కల్చర్, జెండర్ ఆన్ హెల్త్, జెండర్ ఆన్ మీడియా.. లాంటి ఇష్యూస్ అన్నీ చర్చకు రానున్నాయి. వీటికి సంబంధించి అన్ని దేశాల నుంచి మొత్తం 850 ప్రెజెంటేషన్ పేపర్లు వచ్చాయి. ఇక్కడకు వచ్చిన విదేశీ వనితలు హైదరాబాద్ ఎరుుర్పోర్ట్ను చూడగానే అమేజింగ్ ప్లేసంటూ ఆశ్చర్యపోతున్నారు. సిటీలోని చారిత్రక కట్టడాలు చూడాలనుకుంటున్నారు. అందుకే వాళ్ల కోసం చివరి రెండు రోజులు టూర్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం’ అని చెప్పారు ప్రొఫెసర్ రేఖాపాండే. నెదర్లాండ్స్లో ప్రేరణ కొన్నేళ్ల క్రితం నెదర్లాండ్స్లో జరిగిన ఫ్యామిలీ కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యారు రేఖాపాండే. అక్కడికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రముఖులూ వచ్చారు. ఆ సదస్సు చూసి ముగ్దురాలైన రేఖా పాకిస్థానీ డెలిగేట్ ఫారూఖ్తో ‘ఇలాంటి కాన్ఫరెన్స్ ఇండియాలోనో, పాకిస్థాన్లోనో జరిగితే ఎంత బాగుంటుంది?’ అని అన్నారట. అందుకాయున ‘విమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ అని ఇంకోటి ఉంది.. అది జరిగితే నిజంగానే చాలా గ్రేట్గా ఉంటుంది. మీకు ఆసక్తి ఉంటే నేను హెల్ప్ చేస్తాను’ అన్నారట ఫారూఖ్. అనడమే కాదు దానికి సంబంధించిన ప్రాసెస్లో ఆయున సాయుం కూడా చేశారట. అయితే ఆ ఏడాది అది ఆస్ట్రేలియూకు దక్కింది. ఏమైతేనేం చివరకు ఈ ఏడాది విమెన్స్ వరల్డ్స్ కాంగ్రెస్ హైదరాబాద్ చేరుకుని వున వేడుకైంది.