breaking news
Rabat
-
Morocco: భూకంప విలయం.. 1000 మంది మృతి
రాబత్: ప్రకృతి విలయంతో ఆఫ్రికా దేశం మొరాకో తల్లడిల్లిపోయింది. శుక్రవారం రాత్రి సమయంలో మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. కనీసం 1000 మంది మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎటు చూసినా భవనాలు కుప్పకూలిపోయి.. అయిన వాళ్ల కోసం ఆర్తనాదాలు పెడుతున్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. శుక్రవారం రాత్రి 11.11 సమయంలో మధ్య మొరాకో మర్రకేచ్ నగరం కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 7.2 త్రీవతతో భూకంపం సంభవించింది. ఉన్నట్లుండి భవనాలు కుప్పకూలిపోయాయి. రోడ్డుల వెంట ఉన్న జనం.. ప్రాణ భయంతో పరుగులు తీశారు. రాత్రంతా రోడ్ల మీదే గడిపారు. భూకంపం ధాటికి.. వందల సంఖ్యలో మరణించి ఉంటారని మొరాకో ప్రభుత్వం ప్రకటించింది. మరో 300 మందిదాకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని ప్రభుత్వం చెబుతోంది. Moment when powerful 6.8 magnitude #earthquake rocked #Morocco atleast 296 dead #moroccoearthquake #moroccosismo #Sismo #viral #BREAKING pic.twitter.com/2fyjtgEC2O — Utkarsh Singh (@utkarshs88) September 9, 2023 మొరాకో భూకంపం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్(ట్విటర్)లో ఆయన సంతాప సందేశం ఉంచారు. Extremely pained by the loss of lives due to an earthquake in Morocco. In this tragic hour, my thoughts are with the people of Morocco. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. India is ready to offer all possible assistance to… — Narendra Modi (@narendramodi) September 9, 2023 యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11.11 గం. ప్రాంతంలో కొన్ని సెకండ్ల పాటు భారీగా భూమి కంపించింది. భూమి ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఆ తర్వాత.. 19 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు వెల్లడించింది. అయితే మొరాకో నేషనల్ సెయిస్మిక్ మానిటరింగ్ అండ్ అలర్ట్ నెట్వర్క్ మాత్రం.. తీవ్రత 7గా ఉన్నట్లు చెబుతోంది. అలాగే.. కేవలం 8 కిలోమీటర్ల లోతునే ప్రకంపనల కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది. Earthquake Morocco Richter 6.8#marrakech #agadir #casablanca #fes#مراكش #فاس #أغادير #الدار_البيضاء#moroccoearthquake #morocco #earthquakemorocco #earthquake#زلزال_المغرب #هزة_أرضية pic.twitter.com/EXBcv4rw17 — Jalal (@jalaloni) September 8, 2023 Scenes from Morocco's earthquake aftermath Understandably, people don't want to go back indoors because fearing aftershocks#earthquake #Maroc #moroccoearthquake #Morocco #earthquakemorocco #pray #hope #god #Marrakesh pic.twitter.com/cKg1bq0maq — Kinetik (@KinetikNews) September 9, 2023 మొరాకోలో స్వల్పతీవ్రతతో సంభవించే భూకంపాలకు సైతం తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతూ ఉంటుంది. 1960లో రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం.. వేల మందిని బలిగొనడం గమన్హార్హం. ఇదిలా ఉంటే.. పోర్చుగల్, అల్జీరియాలోనూ భూకంపం సంభవించినా.. అవి స్వల్ఫ ప్రకంపనలే అని, ఎలాంటి నష్టం వాటిల్ల లేదని సమాచారం. -
మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..
రాబాత్: మొరాకోలో ప్యాసింజర్లతో వెళ్తోన్న ఓ బస్సు ప్రమాదకరమైన మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో బోల్తా కొట్టింది. ప్రమాదంలో 24 మందిమృతి చెందినట్లు తెలిపింది మొరాకో వార్తా సంస్థ(MAP ). సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డెమ్నాట్లోని వీక్లీ మార్కెట్కు వెళ్తోన్న ఓ బస్సు రోడ్డు మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 24 ముంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించిన సమాచారం అందగానే రాయల్ జెండర్మీర్ పౌర రక్షణ సంస్థ వారు సహాయక చర్యలు చేపట్టారు. దర్యాప్తు బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని విచారణ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మొరాకోలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఏడాదికి రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించేవారు సంఖ్య సగటున 3500గా ఉందని, గతేడాది 3200 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతంలో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయని సరిగ్గా గత ఏడాది ఆగస్టులో తూర్పు కాసాబ్లాంకాలో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకోగా ఆ ప్రమాదంలో 25 మంది మృతి చెందారని అంతకు ముందు 2015లో యువ అథ్లెట్లు ప్రయాణిస్తున్న ఒక బస్సును సెమీ ట్రైలర్ ట్రక్కు ఢీకొట్టడంతో 33 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: చైనాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు.. -
మొరాకోలో 32 మంది మృతి
రాబత్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా మొరాకో దేశంలోని వివిధ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో 32 మంది మరణించారని ఆ దేశ హోంశాఖ మంత్రి మంగళవారం మొరాకో రాజధాని రాబత్ లో వెల్లడించారు. వారిలో ఆరుగురు ఆచూకీ తెలియలేదన్నారు. వీరంతా దేశానికి దక్షిణ ప్రాంతంలోని అల్జీరియా సరిహద్దుల్లోని గ్లుమిమ్ నగరవాసులను తెలిపారు. నదులు, కాలువ పరివాహక ప్రాంతాల్లోని 214 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. వర్షాలు, వరదల తాకిడికి దేశంలోని చాలా నగరాల మధ్య రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర అటంకం కలుగుతుందన్నారు. రవాణా వ్యవస్థను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నిన్న ఉదయం వరదల్లో చిక్కుకున్న 14 మంది భద్రత సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో రక్షించినట్లు ఆ దేశ హోంశాఖ మంత్రి వెల్లడించారు.