breaking news
prakash mehra
-
అలీతో సినిమా చేయాలనుకున్నాం: అమితాబ్
ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మొహ్మద్ అలీ మరణం పై బాలీవుడ్ ఇండస్ట్రీ స్పందించింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ లెజెండరీ అథెలెట్ పై ప్రంశంసలు కురిపించగా మరికొంత మంది ఆయనతో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో మాట్లాడిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 1979లో బిగ్ బీ మొహ్మద్ అలీని స్వయంగా కలిసినట్టుగా తెలిపారు. 'ప్రముఖ దర్శకుడు ప్రకాష్ మెహ్రాతో కలిసి లాస్ ఏంజిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లాం. అలీ చాలా సింపుల్ గా ఉన్నారు. నవ్వుతూ పలకరించారు' అని తెలిపారు. అంతేకాదు అప్పట్లో ప్రకాష్ మెహ్రా అమితాబ్, మొహ్మద్ అలీల కాంబినేషన్ లోసినిమా తెరకెక్కించాలని భావించారట. ఆ విషయం పై చర్చలు జరిపేందుకే అలీ ఇంటికి వెళ్లినట్టు తెలిపారు అమితాబ్. -
‘జంజీర్’ రీమేక్పై స్టేకు బాంబే హైకోర్టు నిరాకరణ
ముంబై: గతంలో బాలీవుడ్లో ఘన విజయం సాధించిన ‘జంజీర్’ సినిమా రీమేక్ విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. దీనిపై కథా రచయితలు సలీమ్ఖాన్, జావెద్ అక్తర్లు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. సోమవారం ఈ కేసును విచారించిన బాంబే కోర్టు ఆ చిత్ర రీమేక్ విడుదలపై స్టే విధించేందుకు నిరాకరించింది. పాత జంజీర్ చిత్ర కథ, స్క్రిప్ట్, డైలాగులకు సంబంధించిన కాపీరైట్లు తమ వద్ద ఉన్నాయని...అందువల్ల అదే పేరుతో దాన్ని రీమేక్ చేసిన నాటి నిర్మాత ప్రకాశ్ మెహ్రా కుమారుల నుంచి రూ. 6 కోట్ల పరిహారం ఇప్పించాలని సలీమ్, జావెద్లు కోర్టును కోరారు. తమ స్క్రిప్టు ఆధారంగా ఒకసారి చిత్రాన్ని తెరకెక్కించేందుకే గతంలో ప్రకాశ్ మెహ్రాకు అనుమతి ఇచ్చామన్నారు. అందువల్ల రెండోసారి తమ అనుమతి లేకుండా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం కుదరదన్నారు. అయితే పిటిషనర్లు ఆలస్యంగా ప్రతివాదులపై కేసు వేయడంతోపాటు స్వయంగా నగదు రూపంలో పరిహారం కోరుతున్నందున ఈ చిత్రంపై స్టే విధించాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. కేసు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. టాలీవుడ్ హీరో రామ్చరణ్తేజ జంజీర్ రీమేక్ ద్వారా తొలిసారి బాలీవుడ్కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.